Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ప్రసాదం ధర పెంపుపై వెనక్కి తగ్గిన తితిదే (Video)

Webdunia
ఆదివారం, 17 నవంబరు 2019 (13:10 IST)
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదమైన లడ్డూ ధర పెంపుపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెనక్కి తగ్గింది. శ్రీవారి ప్రసాదమైన లడ్డూ ధరను పెంచబోవడం లేదని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 
 
ఆయన ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని చెన్నైకు శనివారం తిరిగివచ్చారు. ఆయన్ను చెన్నైలోని ప్రముఖ సామాజిక సేవా సంస్థ ఉంగలుక్కాక చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ సునీల్‌ సాదరస్వాగతం పలికారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లడ్డూ ధరను సవరించడం లేదని, ప్రస్తుతం కొనసాగుతున్న విధానంలోనే లడ్డూల విక్రయాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. 
 
కాగా, గత వారంలో టీటీడీ అధికారులు సమావేశమై, ప్రస్తుతం రూ.25గా ఉన్న లడ్డూ ధరను రూ.50కి పెంచాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ధర పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana : పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ వల్ల తెలంగాణ ఇబ్బందా?

ఆ నీళ్ళు రాజస్థాన్‌కు మళ్లిస్తాం.. పాక్ గొంతు ఎండాల్సిందే : అమిత్ షా

క్వారీ యజమానికి బెదిరింపులు - ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు

భారత్ - పాక్ యుద్ధాన్ని ఆపాను... నోబెల్ శాంతి బహుమతి రాదేమో? : డోనాల్డ్ ట్రంప్

స్త్రీ ఒక పువ్వు - ప్రశంస లేకుండా ఒక పువ్వుతో వ్యవహరిస్తే... : అలీ ఖమేనీ

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

తర్వాతి కథనం
Show comments