Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న ఉదయం 10 గంటలకు శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు విడుదల

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (21:00 IST)
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర్ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే తమ ఈతి బాధలన్నీ తొలగిపోతాయని ప్రతి ఒక్క శ్రీవారి భక్తుడి ప్రగాఢ విశ్వాసం. అయితే, శ్రీవారి దర్శనం అంత సులంభంకాదు. సర్వదర్శనం క్యూ లైన్లలో వెళ్లితే కనీసం 24 గంటల పాటైనా వేచివుండాలి. ఇక అర్జిత సేవల టిక్కెట్లు దక్కాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 24వ తేదీన శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లను రిలీజ్ చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ప్రకటించింది. అక్టోబరు నెలకు సంబంధించిన ఈ అర్జిత సేవా టిక్కెట్లను 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. 
 
అదే రోజున మధ్యాహ్నం 2 గంటలకు మరికొన్ని టిక్కెట్లను, లక్కీ డిప్ ద్వారా కేటాయించనున్నట్టు తెలిపింది. అలాగే, అక్టోబరు నెలకు సంబంధించి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శనం కోటా టిక్కెట్లను కూడా ఆగస్టు 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు తితిదే అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందా? కేంద్ర పెట్రోలియం మంత్రి ఏమంటున్నారు?

దళితులకు అరగుండు చేసి.. బలవంతంగా మురుగు నీరు తాగించారు.. ఎక్కడ?

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

అన్నీ చూడండి

లేటెస్ట్

19-06-2025 గురువారం దినఫలితాలు - వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు...

బుధవారం అష్టమి రోజున ఇలా చేస్తే?

18-06-2025 బుధవారం దినఫలితాలు - అప్రియమైన వార్త వినవలసివస్తుంది

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

తర్వాతి కథనం
Show comments