45 నిమిషాల్లో తిరుమల శ్రీవారి దర్శనం.. తిరుమల గిరులు ఖాళీ...

తిరుమల గిరులపై ఒక్కోసారి ఒక్కో రకమైన అద్భుతం జరుగుతుంది. సాధారణంగా అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కనీసం 6 నుంచి 10 గంటల సమయం పడుతుంది. రద్దీ సమయాల్లో అయితే కనీసమంటే రెండురోజులు ఈజీగా పడుతుంది. కానీ తిరుమలలో ప్రస్తుతం మాత్రం 45 నిమిషాల్లోనే

Webdunia
బుధవారం, 24 జనవరి 2018 (17:59 IST)
తిరుమల గిరులపై ఒక్కోసారి ఒక్కో రకమైన అద్భుతం జరుగుతుంది. సాధారణంగా అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కనీసం 6 నుంచి 10 గంటల సమయం పడుతుంది. రద్దీ సమయాల్లో అయితే కనీసమంటే రెండురోజులు ఈజీగా పడుతుంది. కానీ తిరుమలలో ప్రస్తుతం మాత్రం 45 నిమిషాల్లోనే శ్రీవారి దర్శన భాగ్యం భక్తులకు లభిస్తోంది. అయితే రథసప్తమి జరుగుతున్నా భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో త్వరితగతిన శ్రీవారి దర్సనం లభించడం టిటిడి అధికారులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 
సాధారణంగా రథసప్తమి నాడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంటుంది. కిక్కిరిసిన జనం శ్రీవారి వాహన సేవలో పాల్గొని ఆ తరువాత స్వామివారిని దర్శించుకుంటుంటారు. అయితే ఈసారి మాత్రం భక్తుల రద్దీ పెద్దగా కనిపించ లేదు. స్వామివారి దర్శనం అయిన భక్తులే ఎక్కువగా వాహన సేవలో కనిపించారు. వాహన సేవలను తిలకించిన తరువాత నేరుగా గమ్యస్థానాలకు భక్తులు బయలుదేరి వెళ్ళారు. దీంతో తిరుమలలో రద్దీ కనిపించలేదు. గత మూడు నెలల తరువాత 45 నిమిషాల్లో శ్రీవారి దర్శనం భక్తులకు లభిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

లేటెస్ట్

21-10-2025 మంగళవారం దినఫలాలు - ఆత్మీయులతో సంభాషణ మనోధైర్యాన్నిస్తుంది...

20-10-2025 సోమవారం దినఫలాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

19-10-2025 ఆదివారం దినఫలాలు - దుబారా ఖర్చులు విపరీతం...

19-10-2015 నుంచి 25-10-2025 వరకు మీ వార రాశిఫలాలు

TTD: తెలంగాణ భక్తుల వద్ద రూ.4లక్షల మోసం-దళారులను నమ్మొద్దు.. టీటీడీ వార్నింగ్

తర్వాతి కథనం
Show comments