Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు...

Webdunia
సోమవారం, 30 మే 2016 (11:14 IST)
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. జూన్‌ నెలలో సెలవులు ముగియనుండటంతో భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. గత 15 రోజులుగా ఇదేపరిస్థితి తిరుమలలో నెలకొంది. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోగా వారికి దర్శన సమయం 12 గంటలకుపైగా పడుతోంది. 
 
అలాగే కాలినడక భక్తులు కంపార్టుమెంట్లు మాత్రం కాస్త తక్కువగానే ఉంది. నాలుగు కంపార్టుమెంట్లలో మాత్రమే కాలినడక భక్తులు వేచి ఉండగా వారికి దర్శన సమయం 4 గంటలు పడుతోంది. గదులు భక్తులకు సులువుగానే లభిస్తున్నాయి. తలనీలాలను కూడా సులువుగానే భక్తులు సమర్పిస్తున్నారు. 
 
ఆదివారం శ్రీవారిని 1,03,384 మంది భక్తులు దర్శించుకున్నారు. తితిదే చరిత్రలోనే ఇంత మంది భక్తులు దర్శించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, హుండీ ఆదాయం ఆదాయం 2 కోట్ల 98లక్షల రూపాయలు వసూలైంది.
 
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శనా సమయంలో మంత్రులు గంటా శ్రీనివాస్‌, మృణాళిని, కొల్లురవీంద్ర, పార్లమెంటు సభ్యులు తోట నరసింహం, రవీంద్రబాబు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌లు దర్సించుకున్నారు. ఆలయంలోని రంగనాయక మండపంలో ప్రముఖులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments