తిరుమలకు పోటెత్తిన భక్తులు... 8 రాష్ట్రాల నుంచి రాక

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (10:10 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా గత 80 రోజులుగా శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించలేదు. ఇపుడు అంటే 82 రోజుల తర్వాత శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలో గురువారం నాడు 8 రాష్ట్రాల నుంచి భక్తులు వెంకన్న స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 
 
గురువారం స్వామిని దర్శించుకున్న భక్తుల్లో 8 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో తెలంగాణ నుంచి 143, తమిళనాడు 141, కర్ణాటక నుంచి 151 మందితో పాటు మహారాష్ట్ర, న్యూఢిల్లీ, అరుణాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు. చాలా రోజుల తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం సంతోషాన్నిచ్చిందని భక్తులు తెలిపారు.
 
దీనిపై తితిదే అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు పాటిస్తూ తిరుమల, తిరుపతిలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో పని చేసి పక్కా ప్రణాళికతో దర్శన ఏర్పాట్లు చేశామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

Hayatnagar, ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కల దాడి, చెవిని పీకేసాయి

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-12-2025 నుంచి 31-12-2025 వరకు మీ మాస ఫలితాలు

30-11-2025 ఆదివారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి

Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు

శబరిమల ఆలయం నుండి బంగారం మాయం.. మాజీ తిరువాభరణం కమిషనర్‌ వద్ద విచారణ

29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments