Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులు త్వరపడండి వచ్చే నెలలో శ్రీవారిని దర్సించుకోవాలంటే..?

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (20:20 IST)
కోవిడ్ కారణంగా ఆన్ లైన్ లోనే టిక్కెట్లను టిటిడి మంజూరు చేస్తోంది. ఉచిత దర్సన టోకెన్లయినా, 300 రూపాయల దర్సనం టోకెన్లు అయినా ఏదైనా సరే ఖచ్చితంగా ఆన్ లైన్ లోనే పొందాల్సిన పరిస్థితి. అందులోను కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయాన్ని టిటిడి తీసుకుంటోంది. 

 
ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్సనం కోటాను ఈనెల 27వ తేదీన విడుదల చేసేందుకు సిద్థమైంది టిటిడి. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్సనం టిక్కెట్లను ఈనెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్లో విడుదల చేయనుంది టిటిడి.

 
అలాగే ఫిబ్రవరి నెలలో సర్వదర్సనం టోకెన్లకు సంబంధించి ఈ నెల 28వ తేదీన ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్లో టోకెన్లను అందించనుంది. పరిమిత సంఖ్యలోనే టోకెన్లను విడుదల చేయనుంది. 

 
భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్సనం టోకెన్లను పొందాలని.. కోవిడ్ వ్యాక్యినేషన్, కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. గతంలోలా సర్టిఫికెట్ తీసుకొచ్చినా టిటిడి అధికారులు చూసేవారు కాదు. కానీ ప్రస్తుతం కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ లేకుంటే రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉంటేనే దర్సనానికి అనుమతిస్తామని టిటిడి స్పష్టం చేస్తోంది.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

తర్వాతి కథనం
Show comments