Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కొండంత రద్దీ - కంపార్టుమెంట్లు నిండి బయటకు క్యూలైన్లు...

Webdunia
ఆదివారం, 15 మే 2016 (10:51 IST)
తిరుమల భక్తులతో పోటెత్తింది. గత మూడు రోజులుగా ఉన్న రద్దీ కన్నా ఎక్కువగా తిరుమలలో భక్తులు కనిపిస్తున్నారు. శుక్ర, శనివారాలలో తిరుమలకు చేరుకున్న భక్తులు దర్శనం లభించకపోవడంతో ఆదివారం కూడా క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. 32 కంపార్టుమెంట్ల భక్తులతో నిండిపోయి క్యూలైన్లు బయటకు వచ్చేశాయి. కాలినడక కంపార్టుమెంట్ల పరిస్థితి కూడా అదే. తిరుమలలో ఎక్కడ చూసినా జనమే.
 
తిరుమలలో గదులు ఖాళీ లేవు. తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట కూడా భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. శనివారం అర్థరాత్రి నుంచి కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో గదులు లేక భక్తులు రోడ్లపైనే సేదతీరుతున్నారు. సర్వదర్శనం భక్తులతో పాటు కాలినడక భక్తులకు ఎన్ని గంటల్లో దర్శనం లభిస్తుందో తితిదే చెప్పలేని పరిస్థితిలో ఉంది. కాగా, శనివారం శ్రీవారిని 88,443 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.24లక్షలుగా వసూలైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అన్నీ చూడండి

లేటెస్ట్

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

29-06-2025 నుంచి 01-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments