Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయం ఐదు రోజులు కాదు.. తొమ్మిది రోజులు మూతపడనుందట..

తిరుమల తిరుపతి దేవస్థానం తొమ్మిది రోజులు మూతపడనుంది. ఈ ఏడాది 2018 ఆగస్టు 9 నుంచి 17వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయం మూతపడనుంది. 12 సంవత్సరాలకు ఓసారి నిర్వహించే మహా సంప్రోక్షణ సందర్భంగా భక

Webdunia
శనివారం, 14 జులై 2018 (14:32 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం తొమ్మిది రోజులు మూతపడనుంది. ఈ ఏడాది 2018 ఆగస్టు 9 నుంచి 17వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీవారి ఆలయం మూతపడనుంది. 12 సంవత్సరాలకు ఓసారి నిర్వహించే మహా సంప్రోక్షణ సందర్భంగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు తిరుమల పాలక మండలి ప్రకటించింది.


ముందుగా ఐదు రోజులు మాత్రమే అని సంకేతాలు ఇచ్చినా.. అత్యవసరంగా సమావేశం అయిన పాలక మండలి తొమ్మిది రోజులు శ్రీవారి దర్శనం సామాన్యులకు లేదని ప్రకటించింది. 
 
ఇందులో భాగంగా.. ఆగస్టు 9వ తేదీ నుంచి తిరుమలకు భక్తులను అనుమతించరు. ఆగస్టు 11వ తేదీన మహా సంప్రోక్షణకు అంకురార్పణ జరుగుతుంది. 12 నుంచి 16వ తేదీ వరకు అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు. ఆగమశాస్త్ర పండితుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలక మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించారు. 
 
ఆగస్ట్ 9వ తేదీ ఉదయం నుంచి ఆగస్ట్ 17వ తేదీ సాయంత్రం వరకు కొండపైకి భక్తుల రాకను నిలిపివేస్తారు. ఈ తొమ్మిది రోజులు కేవలం 30వేల మందికి మాత్రమే దర్శనం కల్పించనున్నారు. ఇది కూడా వీఐపీలకు మాత్రమే అవకాశం ఉండొచ్చు. సామాన్య భక్తులకు మాత్రం ఎంట్రీ ఉండదు. తొమ్మిది రోజులు శ్రీవారి దర్శనం నిలిపివేయటం చరిత్రలో ఇదేనని పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

Srisailam: జూలై 1 నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం

25-06-2025 బుధవారం దినఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Ashadha Amavasya 2025: ఆషాఢ అమావాస్య- వేపచెట్టును నాటితే.. తులసీ పూజ చేస్తే ఏంటి ఫలితం?

UPI-enabled kiosks: తిరుమల లడ్డూ చెల్లింపులు ఇక ఈజీ-యూపీఐ కియోస్క్‌‌లు రెడీ

తర్వాతి కథనం
Show comments