Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు- రేవంత్ రెడ్డి

సెల్వి
గురువారం, 30 జనవరి 2025 (14:27 IST)
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిపాలన విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) తరహాలో ఆలయానికి పాలక మండలిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. బోర్డు ఏర్పాటుకు ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దాని ఏర్పాటు కోసం తయారు చేసిన ముసాయిదా మార్గదర్శకాలకు కొన్ని మార్పులను సూచించారు.
 
యాదాద్రి ఆలయ పాలక మండలిని నియమించడానికి నిబంధనలపై చర్చించడానికి బుధవారం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుమ‌ల మాదిరిగానే యాద‌గిరిగుట్ట ఆల‌యం స‌మీపంలోనూ రాజ‌కీయాలకు తావులేకుండా చూడాల‌న్నారు. ఆల‌య పవిత్రకు భంగం క‌ల‌గ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాల‌ని చెప్పారు. 
 
ధర్మకర్తల మండ‌లి నియామ‌కంతో పాటు యాదగిరిగుట్ట ఆల‌యం త‌ర‌ఫున చేప‌ట్టాల్సిన ప‌లు ఆధ్యాత్మిక‌, సేవా కార్యక్రమాల్లోని ముసాయిదాలో పేర్కొన్న నిబంధ‌న‌ల‌కు సీఎం రేవంత్ ప‌లు మార్పులు సూచించారు. వాటిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, తిరుమల తరహాలో యాదగిరిగుట్టకు ప్రత్యేక బోర్డు ఏర్పాటైతే ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

జగన్‍‌కు పబ్లిసిటీ పిచ్చి పీక్‌కు చేరింది.. ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్... మంత్రి గొట్టిపాటి

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!

అన్నీ చూడండి

లేటెస్ట్

18-06-2025 బుధవారం దినఫలితాలు - అప్రియమైన వార్త వినవలసివస్తుంది

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments