Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రెండు రోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (08:49 IST)
శ్రీవారి పుణ్యక్షేత్రం రెండు రోజులపాటు మూతపడనుంది. ఈ నెల 25వ తేదీన, నవంబరు 8వ తేదీన ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణాల సమయంలో శ్రీవారి ఆలయంలో భక్తుల సందర్శనాన్ని 12 గంటల పాటు నిలిపి వేస్తామని ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాలని తితిదే అధికారులు కోరారు. 
 
ఈ నెల 25వ తేదీన సూర్యగ్రహణం, నవంబరు 8వ తేదీన చంద్రగ్రహణం రాహనున్నాయి. ఈ గ్రహణాలు సంభవించే ఈ రెండు రోజులపాటు స్వామివారి దర్శనాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తితిదే వెల్లడించింది. గ్రహణాల రోజున 12 గంటల పాటు ఆలయం మూసివేయనున్నట్టు తెలిపింది. ఆ సమయంలో ఎలాంటి దర్శనాలను అనుమతించబోమని తెలిపింది. 
 
గ్రహణం సమయాలు.. 
అక్టోబరు 25వ తేదీ సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణ ఘడియలు. ఆ రోజున ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. 
 
అలాగే, నవంబరు 8వ తేదీన చంద్రగ్రహణం. ఆరోజన మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణ ఘడియలు. అందువల్ల నవంబరు 8వ తేదీన 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు మూసివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 యేళ్ల తర్వాత తమకు నచ్చిన వారికి ఓటు వేశామని చెప్పారంటే... : పవన్ కళ్యాణ్

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారికి భారీ విరాళం.. రూ.1.1 కోట్లు విరాళంగా ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

Angarka Chaturthi: అంగారక చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే?

12-08-2025 మంగళవారం దినఫలాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు....

శ్రావణ మంగళవారం- శివపార్వతులకు పంచామృతం అభిషేకం.. ఏంటి ఫలితం?

కీరదోసకు కృష్ణాష్టమికి సంబంధం ఏంటి?

తర్వాతి కథనం
Show comments