Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రెండు రోజుల్లో శ్రీవారి ఆలయం మూసివేత

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (08:49 IST)
శ్రీవారి పుణ్యక్షేత్రం రెండు రోజులపాటు మూతపడనుంది. ఈ నెల 25వ తేదీన, నవంబరు 8వ తేదీన ఆలయాన్ని మూసివేయనున్నారు. గ్రహణాల సమయంలో శ్రీవారి ఆలయంలో భక్తుల సందర్శనాన్ని 12 గంటల పాటు నిలిపి వేస్తామని ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించాలని తితిదే అధికారులు కోరారు. 
 
ఈ నెల 25వ తేదీన సూర్యగ్రహణం, నవంబరు 8వ తేదీన చంద్రగ్రహణం రాహనున్నాయి. ఈ గ్రహణాలు సంభవించే ఈ రెండు రోజులపాటు స్వామివారి దర్శనాలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తితిదే వెల్లడించింది. గ్రహణాల రోజున 12 గంటల పాటు ఆలయం మూసివేయనున్నట్టు తెలిపింది. ఆ సమయంలో ఎలాంటి దర్శనాలను అనుమతించబోమని తెలిపింది. 
 
గ్రహణం సమయాలు.. 
అక్టోబరు 25వ తేదీ సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణ ఘడియలు. ఆ రోజున ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. 
 
అలాగే, నవంబరు 8వ తేదీన చంద్రగ్రహణం. ఆరోజన మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణ ఘడియలు. అందువల్ల నవంబరు 8వ తేదీన 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు మూసివేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

లేటెస్ట్

Ugadi 2025: శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం.. విశేష ధనం లభిస్తుందట..

30-03-2025 నుంచి 05-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు..దంపతుల మధ్య అకారణ కలహం

29-03-2025 శనివారం దినఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం...

28-03-2025 శుక్రవారం దినఫలితాలు - ఖర్చులు అందుపులో ఉండవు...

Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..

తర్వాతి కథనం
Show comments