Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే నెలలో మాత్రం కోటి లడ్డూల పంపిణీ.. శ్రీవారి లడ్డూ రికార్డు.. టీటీడీ ప్రకటన

Webdunia
సోమవారం, 6 జూన్ 2016 (12:56 IST)
కలియుగ వైకుంఠం, తిరుమల శ్రీవారి ప్రసాదం అంటేనే మనకు ముందు గుర్తుకొచ్చేది లడ్డూ ప్రసాదమే. టీటీడీ దేవస్థానం తయారు చేస్తున్న లడ్డూలను లక్షలాది మంది భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక్క మే నెలలోనే కోటి లడ్డూలను పంపిణీ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డు సృష్టించింది. 
 
వేసవి సెలవులు కావడంతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరగడంతో మేలో మాత్రం కోటి లడ్డూలను శ్రీవారి ఆలయ పోటు విభాగం పంపిణీ చేసినట్లు ఆదివారం తేలింది. ఎన్నడూ లేనంతగా మే నెలలో 25.08 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
స్వామిని దర్శించుకునే ధర్మదర్శనం భక్తులకు రాయితీపై రూ.20 ధరతో 2, అదనపు లడ్డూలు కింద రూ.50పై రెండు 2 వంతున ఒక్కొక్కరికి నాలుగు లడ్డూలు టీటీడీ అందిస్తుంది. ఇంకా కాలినడక వచ్చే యాత్రికులు, వికలాంగులు, వృద్ధులు, వీఐపీ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లపై ఇచ్చే లడ్డూలను లెక్కిస్తే.. మే నెలలో మాత్రం కోటివరకు లడ్డూలను భక్తులకు పంపిణీ చేసినట్లు.. తద్వారా రికార్డు సృష్టించినట్లు టీటీడీ వెల్లడించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

తర్వాతి కథనం
Show comments