Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ

Webdunia
ఆదివారం, 5 జూన్ 2016 (13:56 IST)
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. తిరుమల గిరులు మొత్తం భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. తిరుమల జిఎన్‌సి టోల్‌గేట్‌ నుంచి గార్డెన్‌లు, చెట్ల కింద, ఖాళీగా ఉన్న ప్రాంతాలు ఎక్కడ చూసినా భక్తులే. శనివారం రాత్రి నుంచి రద్దీ మరింత పెరిగింది. ఆదివారం ఉదయానికి కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లన్నీ బయటకు వచ్చేశాయి. కాలినడక భక్తుల కంపార్టుమెంట్ల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. సర్వదర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతుండగా కాలినడకకు 13గంటలకు పైగా సమయం పడుతోంది. 
 
తితిదే పైన పేర్కొన్న సమయంలోపన దర్శనం చేయిస్తామని చెబుతున్నా ఆ సమయం రెట్టింపవుతోంది. గదులన్నీ నిండిపోయాయి. తల నీలాల కోసం గంటల తరబడి పడిగాపులు. నిన్న శ్రీవారిని 80 వేల మందికిపైగా దర్శించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 53 లక్షల రూపాయలు లభించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy rain alert: అల్పపీడనం శక్తి తుఫాన్‌గా మారింది.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Pawan Kalyan: టెక్కలిలో సినిమా తెరపై మన ఊరు - మాటామంతి.. పవన్ ఐడియా

మూలిగే నక్కపై తాటిపండు పండింది... వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం

వైకాపా నేత బోరుగడ్డ ఇక జైలుకే పరిమితమా?

Minor girl: 15 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

అన్నీ చూడండి

లేటెస్ట్

20-05-2025 మంగళవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments