Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 11న కోదండరామాలయంలో పుష్పయాగం

Webdunia
సోమవారం, 9 మే 2016 (11:08 IST)
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మే 11వ తేదీన పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరుగనుంది. మే 10వ తేదీ సాయంత్రం అంకురార్పణను తితిదే నిర్వహించుంది. పుష్పయాగం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలు రకాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేస్తారు. 
 
అనంతరం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారు ఆలయ నాలుగు మాడా వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆస్థానాన్ని కూడా తితిదే నిర్వహించనుంది. కోదండ రామస్వామి ఆలయంలో ఏప్రిల్‌ 4 నుంచి 13వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాల్లోగానీ, నిత్యకైంకర్యాలల్లోగానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార, అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీతెలియక ఏవైనా లోపాలు జరిగే ఉంటే వాటికి ప్రాయశ్చితంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకుల నమ్మకం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijayawada: విజయవాడలో బాంబు కలకలం: అజ్ఞాత వ్యక్తి ఫోన్.. చివరికి?

Vallabhaneni Vamsi: పోలీసుల కస్టడీలో తీవ్ర అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ

లుకౌట్ నోటీసు దెబ్బకు కలుగులోని ఎలుక బయటకు వచ్చింది.. (Video)

గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డు మలుపు వద్ద ఘోరం ... ఐదుగురు స్పాట్ డెడ్

వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. నిందితులంతా సహచరులే...

అన్నీ చూడండి

లేటెస్ట్

సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి

21-05-2025 బుధవారం దినఫలితాలు - వృధా ఖర్చులు తగ్గించుకుంటారు....

20-05-2025 మంగళవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

తర్వాతి కథనం
Show comments