Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నులపండువగా పుష్పయాగం, జపతర్పణ హోమాలు

Webdunia
సోమవారం, 19 జులై 2021 (20:04 IST)
కలియుగ వేంకటేశ్వరస్వామి పట్టపురాణి పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగంలో భాగంగా శాస్త్రోక్తంగా పుష్పయాగం, జపతర్పణ హోమాలు జరిగాయి. ఏకాంతంగానే ఈ కార్యక్రమాలను టిటిడి నిర్వహిస్తోంది.
 
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు.  ఉదయాన్నే ఆలయంలోని శ్రీక్రిష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారిని వేంచేపు చేశారు. టిటిడి పాంచరాత్ర ఆగమ పండితుల పర్యవేక్షణలో బుత్వికులు చతుష్టార్చన, కోటి కుంకుమార్చనలో ఒక ఆవర్తి, హోమం, లఘుపూర్ణాహుతి నిర్వహించారు.
 
ఇందులో భాగంగా 120మంది కోటి అర్చన, 36మంది హోమం, 12మంది భాష్యం, రామాయణం, భాగవతం, మహాభారతం పారాయణం, 12మంది జపం, 12మంది ఆవుపాలతో తర్పణం నిర్వహిస్తున్నారు.
 
వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగాన్ని నిర్వహించారు. కోవిడ్ కారణంగా ఏకాంతంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాధారణంగా భక్తుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమం గత యేడాది నుంచి కోవిడ్ కారణంగా ఏకాంతంగానే టిటిడి నిర్వహిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

లేటెస్ట్

19-06-2025 గురువారం దినఫలితాలు - వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు...

బుధవారం అష్టమి రోజున ఇలా చేస్తే?

18-06-2025 బుధవారం దినఫలితాలు - అప్రియమైన వార్త వినవలసివస్తుంది

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

తర్వాతి కథనం
Show comments