నవంబరు ఒకటో తేదీ నుంచి తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (15:57 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో నవంబరు ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్ వాడకంపై విధించిన నిషేధం అమల్లోకి రానుంది. ఇప్పటికే పరిశుభ్రతలో జాతీయ స్ధాయి అవార్డులు దక్కించుకున్న తితిదే... తిరుమలలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఈ నెల 2న గాంధీ జయంతి రోజు నుంచి తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ కవర్లపై పూర్తి స్థాయిలో నిషేధం విధించారు. 
 
దీంతో తిరుపతి నగరంలో చాలావరకు ప్లాస్టిక్ కవర్లు తగ్గిపోయాయి. తిరుపతి వాసులు కూడా ప్లాస్టిక్ కవర్లు లేక పోవడంతో, క్లాత్ బ్యాగ్స్, కాటన్ బ్యాగులు వంటి ప్రతామ్నాయ వస్తువులకు అలవాటుపడుతున్నారు. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు తిరుగాడే తిరుమలలో కూడా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండటంతో తిరుమలలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
 
తిరుమల నిత్యం భక్తుల రద్దీతో కిటికిటలాడే పుణ్యక్షేత్రం. ఇక్కడకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు తమతో తెచ్చుకునే లగేజీలో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు ఉంటున్నాయి. ఇక హోటల్స్ షాపులు కూడా ప్లాస్టిక్ కవర్లను ఎక్కువగా వాడుతున్నారు. టీటీడీ కూడా తను ఇచ్చే లడ్డూ ప్రసాదాల్లో ప్లాస్టిక్ కవర్లే వాడుతోంది. వీటన్నింటిపై నిషేధం విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

లేటెస్ట్

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

తర్వాతి కథనం
Show comments