Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబరు ఒకటో తేదీ నుంచి తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం

Webdunia
బుధవారం, 31 అక్టోబరు 2018 (15:57 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో నవంబరు ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్ వాడకంపై విధించిన నిషేధం అమల్లోకి రానుంది. ఇప్పటికే పరిశుభ్రతలో జాతీయ స్ధాయి అవార్డులు దక్కించుకున్న తితిదే... తిరుమలలో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఈ నెల 2న గాంధీ జయంతి రోజు నుంచి తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ కవర్లపై పూర్తి స్థాయిలో నిషేధం విధించారు. 
 
దీంతో తిరుపతి నగరంలో చాలావరకు ప్లాస్టిక్ కవర్లు తగ్గిపోయాయి. తిరుపతి వాసులు కూడా ప్లాస్టిక్ కవర్లు లేక పోవడంతో, క్లాత్ బ్యాగ్స్, కాటన్ బ్యాగులు వంటి ప్రతామ్నాయ వస్తువులకు అలవాటుపడుతున్నారు. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు తిరుగాడే తిరుమలలో కూడా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండటంతో తిరుమలలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
 
తిరుమల నిత్యం భక్తుల రద్దీతో కిటికిటలాడే పుణ్యక్షేత్రం. ఇక్కడకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు తమతో తెచ్చుకునే లగేజీలో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు ఉంటున్నాయి. ఇక హోటల్స్ షాపులు కూడా ప్లాస్టిక్ కవర్లను ఎక్కువగా వాడుతున్నారు. టీటీడీ కూడా తను ఇచ్చే లడ్డూ ప్రసాదాల్లో ప్లాస్టిక్ కవర్లే వాడుతోంది. వీటన్నింటిపై నిషేధం విధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంధువుల ఇంటికి వెళ్లిన చిన్నారి శవమై కనపించింది... ఎలా?

వైకాపా ఓటమికి రాజధాని అమరావతి కూడా ఓ కారణం : జోగి రమేశ్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేశ్వల రాజధానినా?

ఏపీ రాష్ట్ర చరిత్రలోనే భారీగా ప్రమోషన్లు.. వైకాపా సానుభూతి ఉద్యోగులకు కూడా..

కిడ్నీ సమస్యలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కన్నుమూత

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

05-06-2025 గురువారం దినఫలితాలు - పిల్లలకు శుభం జరుగుతుంది...

04-06-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతితో అకారణ కలహం...

03-06-2025 మంగళవారం దినఫలితాలు - ధనం అందుతుంది.. ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments