తిరుమలలో కరోనా భయం .. కనిపించని భక్తుల సందడి

Webdunia
బుధవారం, 15 జులై 2020 (11:45 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో కరోనా వైరస్ ఆవహించింది. ఫలితంగా నిత్యం భక్తులతో సందడిగా కనిపించే తిరుమల గిరులు భక్తుల రద్దీ లేక బోసిబోయి కనిపిస్తున్నారు. అసలే లాక్డౌన్ ఆంక్షలతో అరకొర భక్తులతో కనిపించే శ్రీవారి పుణ్యక్షేత్రం.. కరోనా భయం కారణంగా భక్తుల తాకిడి గణనీయంగా తగ్గిపోయింది. 
 
నిజానికి కరోనా లాక్డౌన్‌కు ముందు ప్రతి రోజూ కనీసం 50 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. ఈ సంఖ్య వారంతాల్లో, సెలవుల్లో అయితే భక్తుల సంఖ్య లక్ష దాటేది. భక్తుల గోవింద నామస్మరణలతో తిరుమల గిరులు మారుమ్రోగేవి. 
 
కానీ ఇప్పుడలాలేదు. కరోనా భయంతో భక్తులు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. లాక్డౌన్ ఆంక్షలు సడలించి భక్తులను దర్శనానికి అనుమతించడం మొదలుపెట్టాక ఇంతవరకు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కేలవం 2.50 లక్షలు మాత్రమే. 
 
అయితే తిరుమలకు వెళ్లిన భక్తులు ఎవరికీ ఇంతవరకు కరోనా సోకలేదు. కానీ, తితిదే ఉద్యోగుల్లో 91 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో భక్తులు కూడా తిరుమల పుణ్యక్షేత్రానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా తిరుమల భక్తుల సందడి పెద్దగా లేకుండా కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టెలివిజన్ నటి లైంగిక వేధింపులు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ కొంపముంచింది..

తనను ప్రేమించను అన్నందుకు బాలికను తుపాకీతో కాల్చిన దుండగుడు (video)

Chevireddy: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టు చేసిన పోలీసులు - 12మంది అరెస్ట్

ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధి: 700 ఎకరాల భూమికి ఆమోదం

అన్నీ చూడండి

లేటెస్ట్

Vishweshwara Vrat 2025: విశ్వేశ్వర వ్రతం ఎప్పుడు, ఆచరిస్తే ఏంటి ఫలితం?

Karthika Soma Pradosam: కార్తీక సోమవారం ప్రదోషం.. ఇలా చేస్తే అన్నీ శుభాలే

Prabodhini Ekadashi 2025: చాతుర్మాసం ముగిసింది.. ప్రబోధిని ఏకాదశి.. కదంబ వృక్షం పూజ చేస్తే?

క్షీరాబ్ది ద్వాదశి తులసి-దామోదర కళ్యాణం

01-11-2025 శనివారం దినఫలితాలు- బలహీనతలు అదుపులో ఉంచుకోండి

తర్వాతి కథనం
Show comments