Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటిమిట్ట రాములోరి కల్యాణోత్సవంలో అపశృతి: వడగండ్ల వానతో నలుగురు భక్తుల మృతి

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణోత్సవం జరుగుతున్న వేళ వడగండ్ల వాన రావడంతో భక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షించకుండానే వెనుదిరిగారు.

Webdunia
శనివారం, 31 మార్చి 2018 (09:00 IST)
ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. కడప జిల్లాలోని ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణోత్సవం జరుగుతున్న వేళ వడగండ్ల వాన రావడంతో భక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షించకుండానే వెనుదిరిగారు. శుక్రవారం (మార్చి-30)  ఒంటిమిట్టలో ఒక్కసారిగా గాలి వాన.. ఉరుములు మెరుపులు రావడంతో భక్తులు భయంతో జడుసుకున్నారు. 
 
ఏకంగా ఓ మహిళ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. కోదండరాముడి షెడ్డువద్ద మహిళ గుండెపోటుతో కుప్పకూలిపోయింది. ఒంటిమిట్టలో వడగళ్ల వాన కురవడంతో కల్యాణ వేదిక వద్ద ఏర్పాటుచేసిన చలువ పందిళ్లు కుప్పకూలాయి. భారీ వర్షంతో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
 
అకాల వర్షంతో కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు నానా తంటాలు పడ్డారు. భారీ వర్షంతో పాటు భారీగా వీస్తోన్న ఈదురు గాలులకు కల్యాణవేదిక తారుమారైంది. రేకులు, పైకప్పులు కూలడంతో కొందరు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు.
 
ఇదిలా ఉంటే.. ఒంటిమిట్టలో శుక్రవారం గాలివాన బీభత్సం సృష్టించడంతో రాములోరి కల్యాణం కోసం వెళ్లిన భక్తుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 52మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను కడప రిమ్స్‌కు తరలించగా.. వారిని సీఎం చంద్రబాబునాయుడు శనివారం పరామర్శించారు. 
 
కాగా.. గాలివానలో మరణించిన మృతుల కుటుంబాలకు రూ.15లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 3లక్షలు ఎక్స్‌గ్రేషియాను చంద్రబాబు సర్కారు ప్రకటించింది. ఇకపోతే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నాడు రథోత్సవం జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

Light Lamps: దీపాల వెలుగులు ఇంటికి ఎలా మేలు చేస్తాయో తెలుసా?

TTD: మూడవ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిర్మాణం.. టీటీడీ బోర్డ్ భేటీలో కీలక నిర్ణయాలు

22-07-2025 మంగళవారం దినఫలితాలు - ఓర్పుతో మెలగండి.. స్థిరాస్తి ధనం అందుతుంది...

Bhauma Pradosham: భౌమ ప్రదోషం-రుణ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే అప్పులు తీరడం ఖాయం

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

తర్వాతి కథనం
Show comments