Webdunia - Bharat's app for daily news and videos

Install App

19 నుంచి జమ్మలమడుగు శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Webdunia
గురువారం, 5 మే 2016 (18:24 IST)
కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నరపుర వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 19 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించడానికి తితిదే సిద్ధమవుతోంది. మే 18వ తేదీన అంకుకార్పణలో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 19వ తేదీన ధ్వజారోహణం, 20వ తేది చిన్నశేష వాహనం, 21వ తేది సింహ వాహనం, 22వ తేది కల్పవృక్ష వాహనం, 23వ తేది పల్లకీ సేవ, 24వ తేది హనుమంత వాహనం, 25వ తేది రథోత్సవం, 26వ తేది సూర్యప్రభ వాహనం, 27వ తేది చక్రస్నానాన్ని నిర్వహించనున్నారు. 
 
ఉత్సవాల్లో భాగంగా మే 24వ తేది సాయంత్రం కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు ఒక లడ్డూ, ఒక అప్పం, ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా తితిదే ఉచితంగా అందించనుంది. అలాగే అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. మే 28వ తేదీన పుష్పయాగం నిర్వహిస్తారు. 
 
ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు భక్తి సంగీత కార్యక్రమ, హరికథాగానం, కోలాటాలు నిర్వహించనున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments