Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో శుభప్రదం శిక్షణా తరగతులు ప్రారంభం

Webdunia
గురువారం, 5 మే 2016 (18:23 IST)
భారతీయ సనాతన ధర్మంలోని మానవీయ నైతిక విలువలు, ఆర్ష ధర్మాలపై అవగాహన కల్పించి నీతివంతమైన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉన్నతాశయంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో శుభప్రదం వేసవి శిక్షణా తరగతుల బోధకులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తితిదే ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ముక్తేశ్వరరావు వెల్లడించారు. తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయంలో గురువారం అధ్యాపకుల శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని 23 జిల్లాల నుంచి విచ్చేసిన 115 మంది శుభప్రదం శిక్షణా తరగతుల బోధకులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం మే 5వ తేదీ నుంచి 8వ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా అధ్యాపకులు విద్యార్థులతో ఎలా మెలగాలి, పాఠ్యాంశాలు సరళమైన పద్ధతులతో భోదించే విధంగా భోదనా పద్ధతులలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 60 కేంద్రాల్లో 8,9,10వ తరగతుల విద్యార్థులకు మే 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని వివరించారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments