Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్‌ 17న పౌర్ణమి గరుడ సేవ.. భారీ వర్షాలు.. నడక మార్గం మూత

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (20:42 IST)
అక్టోబర్‌ 17న పౌర్ణమి సందర్భంగా నెలవారీ గరుడసేవ జరగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్నారు. గురువారం పున్నమిని పురస్కరించుకుని రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక, దసరా పండగ సెలవులు ముగిసినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 
 
మరోవైపు గురువారం సాయంత్రం వరకు వచ్చే 36 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు యాత్రికుల భద్రత కోసం నివారణ చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారులందరూ మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.
 
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమలలోని గోగర్భం సర్కిల్ నుంచి పాపవినాశనం మార్గంలో భక్తుల ప్రవేశాన్ని టీటీడీ ఇప్పటికే మూసివేసింది. అక్టోబరు 17న శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాన్ని పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. తుపాను వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ నడకదారి పనితీరుపై నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

Jyoti Malhotra: పాకిస్థాన్ ఎంబసీలోకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రాకు ఏం పని?

జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే నిజాలు.. అతనితో కూడా సంబంధాలు..

అన్నీ చూడండి

లేటెస్ట్

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

15-05-2025 గురువారం దినఫలితాలు - అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు...

తర్వాతి కథనం
Show comments