Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్‌ 17న పౌర్ణమి గరుడ సేవ.. భారీ వర్షాలు.. నడక మార్గం మూత

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (20:42 IST)
అక్టోబర్‌ 17న పౌర్ణమి సందర్భంగా నెలవారీ గరుడసేవ జరగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్నారు. గురువారం పున్నమిని పురస్కరించుకుని రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక, దసరా పండగ సెలవులు ముగిసినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 
 
మరోవైపు గురువారం సాయంత్రం వరకు వచ్చే 36 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు యాత్రికుల భద్రత కోసం నివారణ చర్యలు చేపట్టడంలో సంబంధిత అధికారులందరూ మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.
 
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమలలోని గోగర్భం సర్కిల్ నుంచి పాపవినాశనం మార్గంలో భక్తుల ప్రవేశాన్ని టీటీడీ ఇప్పటికే మూసివేసింది. అక్టోబరు 17న శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాన్ని పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. తుపాను వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ నడకదారి పనితీరుపై నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో అర్థరాత్రి చెన్నై యువతిపై అత్యాచారం, ఆటోడ్రైవర్ అరెస్ట్

ఉచిత ఇసుక విధానం.. తేడా జరిగితే అంతే సంగతులు.. బాబు స్ట్రాంగ్ వార్నింగ్

30 ఏళ్ల వయస్సులోనే ఆమెపై 12 కేసులు.. రూ.58.75 లక్షలు మోసం

కొండాపూర్‌లో డాగ్ పార్క్... దేశంలోనే మొట్టమొదటిది ఇదే..

24 గంటల్లోనే 25 ప్రసవాలు- జగిత్యాల వైద్యుల రికార్డ్

అన్నీ చూడండి

లేటెస్ట్

13-10-2004 నుంచి 19-10-2024 వరకు మీ వార ఫలితాలు

శనివారం నాడు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయి?

తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలు.. చక్రస్నానానికి ఏర్పాట్లు పూర్తి

దసరాకు పాలపిట్టకు వున్న సంబంధం ఏంటి?

దసరా శుభ సమయం ఎప్పుడు.. సర్వార్థ సిద్ధి యోగం కూడా..?

తర్వాతి కథనం
Show comments