Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:21 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈనెల 25వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించింది టిటిడి.
 
సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేశారు టిటిడి సిబ్బంది. ఆలయం లోపల జరిగిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏడాదిలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. 
 
ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఆలయాలను శుద్ధి చేస్తున్నారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఆలయంలో తక్కువ సిబ్బందితోనే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించారు. తిరుమంజనం కారణంగా భక్తుల దర్సనాన్ని కాసేపు నిలిపివేశారు. తిరిగి ఉదయం 11.45 గంటల నుంచి సర్వదర్సన భక్తులను దర్సనానికి అనుమతిస్తున్నారు టిటిడి అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

లేటెస్ట్

05-05-2025 సోమవారం దినఫలితాలు-ఒత్తిడి పెరగకుండా చూసుకోండి

తిరుమలలో ఉచిత వివాహాలు.. ప్రేమ, రెండో పెళ్లిళ్లు చేయబడవు.. నియమాలు ఏంటి?

04-05-2025 ఆదివారం దినఫలితాలు - రుణ విముక్తులవుతారు...

04-05-2025 నుంచి 10-05-2025 వరకు ఫలితాలు - శ్రమిస్తేనే కార్యం నెరవేరుతుంది...

Jupiter Transit 2025: మే 14వ తేదీన గురు పరివర్తనం- కన్యారాశికి 75 శాతం సంతోషం-80 శాతం ఆదాయం

తర్వాతి కథనం
Show comments