Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టినరోజు వివాదంపై విశాఖ శారదాపీఠం వివరణ...

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (12:02 IST)
ఈ నెల 18వ తేదీన అంటే నవంబరు 18 బుధవారం విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానేందేంద్ర సరస్వతి పుట్టినరోజు వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని శారదాపీఠం నిర్ణయించింది. 
 
ఇందులోభాగంగా, అర్చకులు, అధికారులతో సహా వచ్చి స్వరూపానందకు ప్రసాదాలు, ఆలయ స్థాయికి తగిన మర్యాదతో కానుకలు సమర్పించుకుని వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. 
 
ఈ మేరకు రాష్ట్రంలోని 23 ప్రముఖ ఆలయాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. టీవీ, పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై ఎట్టకేలకు శారదాపీఠం స్పందించి ఓ ప్రకటన రూపంలో వివరణ ఇచ్చుకుంది.
 
'సనాతన హైందవ ధర్మ పరిరక్షణే విశాఖ శ్రీ శారదాపీఠం ముఖ్య ప్రాధాన్యత. హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా చేయడానికి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానేందేంద్ర సరస్వతి మహాస్వామి చేస్తున్న కృషి విదితమే. గత మూడ్రోజులుగా మహాస్వామి వారి జన్మ దినోత్సవ వేడుకలపై అసత్యప్రచారం, అనవసర రాద్ధాంతం జరుగుతోంది. 
 
మహాస్వామి వారికి భగవంతుని ఆశీస్సులు ఉండాలన్న ఏకైక ఉద్దేశ్యంతో జన్మదిన మహోత్సవం రోజున ఆలయ మర్యాదలు కోరాం. 2004 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఆలయాల నుంచి మహాస్వామి వారికి తీర్థప్రసాదాలను, శేష వస్త్రాన్ని అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సాంప్రదాయం మేరకే ఈ ఏడాది కూడా ఆలయ మర్యాదలు కొనసాగించాలని విశాఖ శ్రీ శారదాపీఠం కోరడమైనది. ఈ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరిస్తాం' అని శారదాపీఠం ఓ ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments