Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త - ఉచిత దర్శన టిక్కెట్లు జారీ

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (11:45 IST)
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తులకు ఉచిత దర్శన టిక్కెట్లను జారీచేసింది. ఆధార్ కార్డు ఆధారంగా రోజుకు 15 వేల ఉచిత టోకెన్లను జారీ చేసేలా చర్యలు తీసుకుంది. మంగళవారం నుంచి జారీ చేసే ఈ టోకన్లను తీసుకున్నవారికి బుధవారం నుంచి దర్శనం కల్పిస్తారు. 
 
అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజస్వామి, సత్రాల వద్ద టోకెన్లను జారీచేస్తారు. ఈ ఉచిత దర్శనం టోకెన్ల కోసం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా పడుతున్నారు. 
 
కాగా, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత కొన్ని నెలలుగా ఉచిత దర్శనం నిలపివేసిన విషయం తెల్సిందే. ఈ సమయంలో కేవలం ఆన్‌లైన్‌లో టిక్కెట్లను జారీ చేస్తూ, వాటిని తీసుకున్న వారికి మాత్రమే శ్రీవారి దర్శనం కల్పిస్తూ వచ్చారు. ఇకపై, సాధారణ భక్తులకు కూడా శ్రీవారి దర్శనం కల్పించేలా తితిదే చర్యలు తీసుకుంది.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments