Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవింద స్వామి ఆలయంలో మూడు పసిడి కిరీటాలు ఏమయ్యాయ్?

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (10:49 IST)
కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం కాసుల వర్షం కురుస్తూనే వుంటుంది. వెంకన్నకు భారీగా విరాళాలు, కానుకలు వచ్చి చేరుతుంటాయి. తిరుమల ఆలయంలోని వెంకన్నకు పసిడి కిరీటాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. 
 
ఈ నేపథ్యంలో తితిదే ఆధ్వర్యంలోని గోవింద స్వామి ఆలయంలో మూడు కిరీటాలు కనిపించట్లేదని.. అదృశ్యమైనట్లు వార్తలు వస్తున్నాయి. గోవింద స్వామి ఆలయంలోని మూల విరాట్‌కు అలంకరించే మూడు కిరీటాలు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. 
 
దీనిపై ఆలయ పూజారులు.. ఆలయ నిర్వాహకుల వద్ద విషయాన్ని తెలియజేశారని.. బోర్డు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇలా గోవింద స్వామి కిరీటాలు చోరీకి గురయ్యాయని ఇందుకోసం ప్రత్యేక బృందం బరిలోకి దిగి దర్యాప్తు మొదలెట్టిందని సమాచారం. 
 
శనివారం సాయంత్రం పూజలు పూర్తయ్యాక నైవేద్యం సమర్పించారని.. తర్వాత ఆలయాన్ని మూతవేశారు. తిరిగి పూజ కోసం ఆలయాన్ని తెరిస్తే.. గోవింద స్వామి పసిడి కిరీటాలు అదృశ్యమయ్యాయని తెలిసింది. ఇవి 528 గ్రాములతో కూడిన రెండు కిరీటాలు, 408 గ్రాములతో కూడిన ఓ కిరీటం మాయమైందని.. శ్రీదేవి, భూదేవి, గోవింద స్వామికి ధరించే మూడు కిరీటాలను కాజేశారని ప్రత్యేక బృందం వెల్లడించింది. దీనిపై ఆలయ అధికారులు, పూజారులు, ఉద్యోగుల వద్ద విచారణ జరుపుతున్నట్లు దర్యాప్తు బృందం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

తర్వాతి కథనం
Show comments