Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి దర్శనం నిలిపివేయడానికి వీల్లేదు.. సీఎం చంద్రబాబు

శ్రీవారి దర్శనంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 12 యేళ్లకు ఒకసారి జరిగే మహాసంప్రోక్షణ మహాఘట్టం సమయంలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయాలని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక

Advertiesment
Chandrababu Naidu
, మంగళవారం, 17 జులై 2018 (11:39 IST)
శ్రీవారి దర్శనంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 12 యేళ్లకు ఒకసారి జరిగే మహాసంప్రోక్షణ మహాఘట్టం సమయంలో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేయాలని తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి నిర్ణయించింది. దీన్ని సీఎం చంద్రబాబు తోసిపుచ్చారు.
 
గతంలో మహా సంప్రోక్షణ జరిగిన సమయంలో ఎటువంటి విధానాలను పాటించారో, ఇప్పుడు కూడా అదే విధానాన్ని పాటించాలని, ఆలయంలోకి భక్తులను అనుమతించాలని ఆదేశించారు. తిరుమల ఆలయంలో దర్శనాల నిలిపివేత అంశంపై విమర్శలు వస్తున్న వేళ, ఈ ఉదయం అధికారులతో పరిస్థితిని సమీక్షించిన ఆయన, పరిమిత సంఖ్యలో అయినా సరే భక్తులకు స్వామి దర్శనం చేయించాలని సూచించారు. 
 
అదేసమయంలో ఆగమ శాస్త్రం ప్రకారం జరిగే మహా సంప్రోక్షణ క్రతువుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దర్శనాలకు ఏర్పాట్లు చేయాలని తితిదే అధికారులను కోరారు. గతంలో 1994, 2006 సంవత్సరాల్లో ఇదే క్రతువు జరిగినప్పుడు పాటించిన నిబంధనలనే ఇప్పుడూ పాటించాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. 
 
కాగా, ఇటీవల తితిదే ఛైర్మన్ సుధాకర్ యాదవ్ సారథ్యంలో సమావేశమైన పాలక మండలి, ఈవీ అనిల్ కుమార్ సింఘాల్‌లు ఐదు రోజుల పాటు శ్రీవారి దర్శనాన్ని భక్తులకు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. ఇది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో కల్పించుకున్న చంద్రబాబు.. దర్శనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యాపిల్లల్ని పక్కనే వున్నారు.. అయినా మహిళా వెయిటర్‌ని తాకరాని చోట..?