Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీతో పొత్తంటూ... జగన్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది : రోజా

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోమారు విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైకాపా పొత్తు పెట్టుకుంటుందని టీడీపీ నేతలు దుష్ప్రచ

బీజేపీతో పొత్తంటూ... జగన్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది : రోజా
, ఆదివారం, 15 జులై 2018 (17:24 IST)
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోమారు విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైకాపా పొత్తు పెట్టుకుంటుందని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందని, ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోనున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తివాస్తవ విరుద్ధమన్నారు. తమ పాలన సరిగ్గా లేదు కాబట్టే, తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 
 
తెలుగుదేశం పార్టీయే బీజేపీతో జతకట్టి అధికారంలోకి వచ్చిందని, అసలు ఆ పార్టీ పొత్తు లేకుండా ఎన్నడూ అధికారంలోకి రాలేదని విమర్శించారు. గతాన్ని ఆ పార్టీ మరచిపోయి లేనిపోని విమర్శలు గుప్పిస్తోందన్నారు. 
 
తమ పార్టీ అధినేత జగన్ కు ధైర్యం ఉంది కాబట్టే 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారని, ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారని అన్నారు. జగన్‌పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టంచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జమిలి ఎన్నికలు మంచి ఆలోచన : రజినీకాంత్