Webdunia - Bharat's app for daily news and videos

Install App

శక్తి స్వరూపిణి అవతారంలో తిరుపతి గంగమ్మ

Webdunia
మంగళవారం, 17 మే 2016 (12:09 IST)
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరలో ప్రధాన ఘట్టమైన జాతర మంగళవారం జరుగుతోంది. తిరుమల వెంకన్నకు స్వయానా చెల్లెలుగా చెప్పుకునే గంగమ్మను దర్శించుకునేందుకు వందలాదిమంది భక్తులు తిరుపతికి చేరుకుంటున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి మ్రొక్కులు తీర్చుకుంటున్నారు.
 
జాతరలోనే ముఖ్యమైన రోజు మంగళవారం. జాతర చాటింపు తర్వాత వారంరోజుల పాటు భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత మంగళవారం పొంగళ్లలో అమ్మవారికి నైవేథ్యం సమర్పిస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఆలయాల వద్ద అమ్మవారికి సారెలను కానుకగా అందిస్తున్నారు. 
 
అమ్మవారికి ఉదయాన్నే ప్రత్యేక అభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు. అమ్మవారు శక్తిస్వరూపిణి అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. వీఐపీలకు దేవస్థానం పాసులు మంజూరు చేయడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
జాతరలో ఏరులై పారుతున్న రక్తం
 
తిరుపతి గంగజాతరలో రక్తం ఏరులై పారుతోంది. జంతుబలి నిషేధం ఉన్నా సరే భక్తులు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా ఆలయ ఆవరణలో జంతువులను బలి ఇస్తున్నారు. జంతు బలితో ఆలయ ఆవరణ మొత్తం రక్తంతో నిండిపోయింది. దేవస్థానం అధికారులు మాత్రం చూసీచూడనట్లు నడుచుకుంటున్నారు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments