Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిపిరి వద్ద ఆ సర్టిఫికేట్ చూపిస్తేనే తిరుమల కొండపైకి ఎంట్రీ

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (19:57 IST)
కోవిడ్ కేసులు తగ్గిపోయాయి.. ఇక ఏముందిలే..తిరుమల దర్సనానికి ఇలా వెళ్ళి అలా వచ్చేయవచ్చు అని చాలామంది భక్తులు భావిస్తుంటారు. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్, రెండు డోస్‌ల సర్టిఫికెట్ అవసరం లేదని భావిస్తుంటారు. కానీ టిటిడి మాత్రం ఆ నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది.

 
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల శ్రీవారి దర్సనార్థం వచ్చే భక్తులు తూచా తప్పకుండా ఆ రెండింటిలో ఒక సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకురావాలని స్పష్టం చేస్తోంది. తిరుపతిలోని అలిపిరి వద్దే ఆ సర్టిఫికెట్లను తనిఖీ చేసి పంపించనున్నారు టిటిడి సెక్యూరిటీ అధికారులు.

 
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది టిటిడి. ఈ విషయాన్ని ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రెండు సర్టిఫికెట్లలో ఏ ఒక్కటి లేకపోయినా ఖచ్చితంగా భక్తులను తిరిగి పంపించేస్తామని స్పష్టం చేశారు.

 
ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు. భక్తులు ఇందుకు సహకరించాలని విజ్ఙప్తి చేస్తున్నారు టిటిడి అధికారులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరోగ్యం జాగ్రత్త అన్నా.. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి.. వీడియో వైరల్ (video)

వచ్చేస్తున్నా భగవంతుడా అంటూ భవనం పైనుంచి దూకేశాడు (video)

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి-71.37 శాతం ఉత్తీర్ణత

నా ఫోన్ లాక్కుంటారా? టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని (video)

వివాహితతో ప్రియుడు రాసలీల, భర్త రావడంతో ట్రంకు పెట్టెలో దాక్కున్న ప్రియుడు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

పంచమి తిథి : వారాహి దేవిని ఇలా పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments