Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలిపిరి వద్ద ఆ సర్టిఫికేట్ చూపిస్తేనే తిరుమల కొండపైకి ఎంట్రీ

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (19:57 IST)
కోవిడ్ కేసులు తగ్గిపోయాయి.. ఇక ఏముందిలే..తిరుమల దర్సనానికి ఇలా వెళ్ళి అలా వచ్చేయవచ్చు అని చాలామంది భక్తులు భావిస్తుంటారు. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్, రెండు డోస్‌ల సర్టిఫికెట్ అవసరం లేదని భావిస్తుంటారు. కానీ టిటిడి మాత్రం ఆ నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది.

 
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల శ్రీవారి దర్సనార్థం వచ్చే భక్తులు తూచా తప్పకుండా ఆ రెండింటిలో ఒక సర్టిఫికెట్ ఖచ్చితంగా తీసుకురావాలని స్పష్టం చేస్తోంది. తిరుపతిలోని అలిపిరి వద్దే ఆ సర్టిఫికెట్లను తనిఖీ చేసి పంపించనున్నారు టిటిడి సెక్యూరిటీ అధికారులు.

 
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది టిటిడి. ఈ విషయాన్ని ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో టిటిడి అదనపు ఈఓ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రెండు సర్టిఫికెట్లలో ఏ ఒక్కటి లేకపోయినా ఖచ్చితంగా భక్తులను తిరిగి పంపించేస్తామని స్పష్టం చేశారు.

 
ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేస్తున్నారు. భక్తులు ఇందుకు సహకరించాలని విజ్ఙప్తి చేస్తున్నారు టిటిడి అధికారులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆఫ్రికా దేశంలో మారణకాండ- 600 మందిని కాల్చిపారేశారు..

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు 2024- రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలి.. మోదీ

కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా.. వెనక్కి తగ్గేదే లేదు..

తిరుమలలో వకుళమాత సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ప్రారంభించిన చంద్రబాబు

వెయిట్ అండ్ సీ అన్న ఉదయనిధి స్టాలిన్ - పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. అంకురార్పణంతో ప్రారంభం

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి.. 4 నుంచి 12 వరకు...

03-10-2024 గురువారం దినఫలితాలు : ఉద్యోగస్తులు ఏకాగ్రత వహించాలి...

01-10-2024 నుంచి 31-10-2024 వరకు మీ మాస ఫలితాలు

02-10-2024 బుధవారం దినఫలితాలు : వ్యాపారాలు ఊపందుకుంటాయి....

తర్వాతి కథనం
Show comments