Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కొండపై కనిపించని భౌతిక దూరం .. శానిటైజేషన్ అస్సలే లేదు..

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (18:29 IST)
కరోనా వైరస్ మహమ్మారి భయం ఇంకా వీడిలేదు. పైగా, ఈ వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదు. ఇప్పటికీ దేశంలో 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తితిదే అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. 
 
అయితే, తిరుమల గిరుల్లో కోవిడ్ నిబంధనలను భక్తులు అపహాస్యం చేస్తున్నారు. భక్తులు కనీస బాధ్యతను విస్మరించి ఇష్టారీతిన తిరిగేస్తున్నారు. ఒక్క ఆలయం లోపల తప్ప.. కొండపై మరేచోటా మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం లేదు.. శానిటైజేషన్ అస్సలే లేదు. 
 
తలనీలాలు ఇచ్చే కల్యాణ కట్టలోనూ ఇదే పరిస్థితి. భక్తులలో ఇంత నిర్లక్ష్యం కనపడుతుంటే.. అటు తిరుమల అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం దారుణం. భక్తులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ.. కోవిడ్ నిబంధనలు పాటించేలా చేయడం అధికారుల బాధ్యత అని, కానీ అది కూడా ఇక్కడ లేకపోవడం విచారకరమని కొంతమంది వాపోతున్నారు. 
 
దూరాభారాలను లెక్క చేయకుండా భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు వస్తుంటారు. ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని తరిస్తుంటారు. అలాంటి ఏడుకొండలపై కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలని.. అసలే సెకండ్ వేవ్ మొదలైందన్న వార్తల నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

తర్వాతి కథనం
Show comments