Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి పుష్కరిణి స్నానాలకు స్వస్తి

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (14:48 IST)
తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలోని పుష్కరిణి స్నానఘట్టాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించాక పుష్కరిణిలో స్నానం ఆచరించి, ఒడ్డునే ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి దర్శనం చేసుకున్న అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లడం ఆనవాయితీ. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగం ప్రబలకుండా ఉండేందుకు అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. 
 
ప్రత్యామ్నాయంగా సమీపంలో 18 స్నానపు గదులు ఏర్పాటు చేశామని, భక్తులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే అధికారులు తిరుమలను తొమ్మిది విభాగాలుగా విభజించి నిత్యం రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. క్యూ కాంప్లెక్స్, అన్నదాన సత్రం, కల్యాణ కట్టలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments