Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశానికి కాలసర్ప దోషం ఉంది: శారద పీఠాధిపతి

దేశానికి కాలసర్ప దోషం ఉంది: శారద పీఠాధిపతి
, బుధవారం, 18 మార్చి 2020 (14:45 IST)
కరోనా (కోవిడ్-19) మహమ్మారి తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ విశాఖ శ్రీ శారదా పీఠంలో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులతో బుధవారం నుంచి ప్రత్యేక హోమాలు ప్రారంభం అయ్యాయి. స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాగాన్ని గణపతి పూజతో ప్రారంభించారు. పీఠంలో నేటి నుంచి ధన్వంతరి, మన్యుసూక్త తదితర హోమాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి. మరోవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తున్న దృష్ట్యా లోక కల్యాణం కోసం శ్రీకాళహస్తీశ్వరాలయంలో బుధవారం ఉదయం 9 గంటలకు ధన్వంతరి హోమం ప్రారంభమైంది. ముందు జాగ్రత్త చర్యగా 12 ఏళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు ఆలయ దర్శనానికి దూరంగా ఉండాలని సూచించింది. అలాగే అన్ని ఆర్జిత సేవలు రద్దు అయ్యాయి.
 
పాప గ్రహాల శక్తి పుంజుకుంది..
ఈ సందర్భంగా విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా నివారించేందుకు అమృత పాశు పత సహిత, విష జ్వర హర యాగాన్ని నేటి నుండి నిర్వహిస్తున్నామన్నారు. వేద మంత్రాలు, బీజాక్షరాల సంపుటి చేసి, ఈ యాగాన్ని సామాజిక స్పృహతో నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశం ధనస్సు రాశిలో ఉన్నందున గురుడు, కుజుడు, కేతువు వంటి గ్రహాల కలయిక, గురుడి శక్తిని క్షీణించేందుకు పాప గ్రహాల శక్తి పుంజుకుందని పేర్కొన్నారు. రాహువు దృష్టి గ్రహాల మీద పడటం వల్ల ఈ నెల 23 వరకు రోగాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నారు. 
 
'శని, కుజుల కలయిక వల్ల దేశ, విదేశాల మీద ప్రభావం ఉంది. ఏప్రిల్ 2 నుండి మే 10 వరకు దేశానికి కాలసర్పదోషం కూడా ఉంది. వీటన్నింటి వల్ల ఈ అమృత పాశు పత సహిత విష జ్వర హర యాగాన్ని నిర్వహిస్తున్నాం. ఈ యాగంలో 11 మంది వేద పండితులు, జపాలు చేసేందుకు మరో 15 మంది ఈ క్రతువులో పాల్గొంటున్నారు. యాగంలో సుగంధ ద్రవ్యాలు, వన మూలికలు, గోమయంతో తయారైన పిడకలు వంటి వాటిని ఉపయోగిస్తున్నాం. ఈ యాగ ధూళి ప్రపంచానికి మంచి చేస్తుంది' అని స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ సోకకుండా వ్యక్తిగత శుభ్రత పాటించాలి.. చంద్రబాబు పిలుపు