Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాంప్రదాయం పాతదే, సిఎం మాత్రం కొత్తగా పట్టువస్త్రాలను సమర్పిస్తూ...

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (15:44 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఎవరు సిఎంగా ఉన్నా సరే పట్టువస్త్రాలను ప్రతియేటా సమర్పిస్తుంటారు. అయితే బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజే సాధారణంగా పట్టువస్త్రాలను ఇస్తుంటారు. 
 
కానీ భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ప్రస్తుత సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఆనవాయితీగా భిన్నంగా పట్టువస్త్రాలను సమర్పించారు. మొదట్లో ఆయన బ్రహ్మోత్సవాల ప్రారంభంలోనే పట్టువస్త్రాలను ఇచ్చేసి వెళ్ళేవారు. ఆ తరువాత గరుడసేవ యథావిథిగా జరిగేది.
 
కానీ ఈ యేడాది మాత్రం ఆనవాయితీ ప్రకారమే ఎపి సిఎం పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా బేడీ ఆంజనేయస్వామి దేవాలయం నుంచి పట్టువస్త్రాలను శిరోధార్యం చేసి ఊరేగింపుగా సిఎం ఆలయంలోకి తీసుకెళ్ళారు.
 
వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీవారికి ఆలయంలోనే పట్టువస్త్రాలను సమర్పించారు. అలాగే వేంకటేశ్వరస్వామిని సిఎం దర్సించుకున్నారు. ఆలయంలో సిఎంకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. 
 
సిఎం వెంట మంత్రులతో పాటు పలువురు స్థానిక నేతలు కూడా ఉన్నారు. బ్రహ్మోత్సవాలు గత యేడాదిగా కూడా కరోనా కారణంగా ఏకాంతంగానే టిటిడి నిర్వహించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

తర్వాతి కథనం
Show comments