Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాంప్రదాయం పాతదే, సిఎం మాత్రం కొత్తగా పట్టువస్త్రాలను సమర్పిస్తూ...

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (15:44 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఎవరు సిఎంగా ఉన్నా సరే పట్టువస్త్రాలను ప్రతియేటా సమర్పిస్తుంటారు. అయితే బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజే సాధారణంగా పట్టువస్త్రాలను ఇస్తుంటారు. 
 
కానీ భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ప్రస్తుత సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఆనవాయితీగా భిన్నంగా పట్టువస్త్రాలను సమర్పించారు. మొదట్లో ఆయన బ్రహ్మోత్సవాల ప్రారంభంలోనే పట్టువస్త్రాలను ఇచ్చేసి వెళ్ళేవారు. ఆ తరువాత గరుడసేవ యథావిథిగా జరిగేది.
 
కానీ ఈ యేడాది మాత్రం ఆనవాయితీ ప్రకారమే ఎపి సిఎం పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా బేడీ ఆంజనేయస్వామి దేవాలయం నుంచి పట్టువస్త్రాలను శిరోధార్యం చేసి ఊరేగింపుగా సిఎం ఆలయంలోకి తీసుకెళ్ళారు.
 
వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీవారికి ఆలయంలోనే పట్టువస్త్రాలను సమర్పించారు. అలాగే వేంకటేశ్వరస్వామిని సిఎం దర్సించుకున్నారు. ఆలయంలో సిఎంకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. 
 
సిఎం వెంట మంత్రులతో పాటు పలువురు స్థానిక నేతలు కూడా ఉన్నారు. బ్రహ్మోత్సవాలు గత యేడాదిగా కూడా కరోనా కారణంగా ఏకాంతంగానే టిటిడి నిర్వహించింది.

సంబంధిత వార్తలు

పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంతవరకు రిజర్వేషన్లు చెక్కు చెదరవు : అమిత్ షా

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన... 24 నాటికి వాయుగుండం...

పిఠాపురం నుంచి అప్పుడే పనులు మొదలెట్టిన పవన్

మహిళపై పగబట్టిన పాము, ఆరేళ్లుగా అదను చూసి కాటు

కిడ్నీల దానం పేరు మనుషుల అక్రమ రవాణా.. కేరళ వాసి అరెస్టు!!

అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. మట్టపల్లి నరసింహుడిని దర్శించుకోండి..

18-05-202 శనివారం దినఫలాలు - దంపతుల మధ్య పరస్పర అవగాహన సంతృప్తి...

17-05-2024 శుక్రవారం దినఫలాలు - అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా...

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

తర్వాతి కథనం
Show comments