Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాంప్రదాయం పాతదే, సిఎం మాత్రం కొత్తగా పట్టువస్త్రాలను సమర్పిస్తూ...

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (15:44 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు జరిగినా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఎవరు సిఎంగా ఉన్నా సరే పట్టువస్త్రాలను ప్రతియేటా సమర్పిస్తుంటారు. అయితే బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజే సాధారణంగా పట్టువస్త్రాలను ఇస్తుంటారు. 
 
కానీ భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ప్రస్తుత సిఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఆనవాయితీగా భిన్నంగా పట్టువస్త్రాలను సమర్పించారు. మొదట్లో ఆయన బ్రహ్మోత్సవాల ప్రారంభంలోనే పట్టువస్త్రాలను ఇచ్చేసి వెళ్ళేవారు. ఆ తరువాత గరుడసేవ యథావిథిగా జరిగేది.
 
కానీ ఈ యేడాది మాత్రం ఆనవాయితీ ప్రకారమే ఎపి సిఎం పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా బేడీ ఆంజనేయస్వామి దేవాలయం నుంచి పట్టువస్త్రాలను శిరోధార్యం చేసి ఊరేగింపుగా సిఎం ఆలయంలోకి తీసుకెళ్ళారు.
 
వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీవారికి ఆలయంలోనే పట్టువస్త్రాలను సమర్పించారు. అలాగే వేంకటేశ్వరస్వామిని సిఎం దర్సించుకున్నారు. ఆలయంలో సిఎంకు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. 
 
సిఎం వెంట మంత్రులతో పాటు పలువురు స్థానిక నేతలు కూడా ఉన్నారు. బ్రహ్మోత్సవాలు గత యేడాదిగా కూడా కరోనా కారణంగా ఏకాంతంగానే టిటిడి నిర్వహించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా అమ్మకు కట్లపొడి, ఆకులు ఇష్టం.. ఉచిత బస్సులో వెళ్తున్నా.. వీడియో వైరల్

Lancet Study: భారత్‌ను వణికిస్తున్న మధుమేహం.. 10మందిలో నలుగురికి ఆ విషయమే తెలియదు!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబడదు.. పల్లా శ్రీనివాసరావు

అమరావతి గురించి ఏడవడం ఆపండి.. వైకాపా నేతలకు కౌంటరిచ్చిన నారాయణ

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో కుప్పకూలిపోయిన యువకుడు.. ఆ తర్వాత?

అన్నీ చూడండి

లేటెస్ట్

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

TTD: తిరుత్తణి కుమార స్వామికి శ్రీవారి సారె -మంగళ వాద్యం, దరువుల మధ్య..?

వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 కోసం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం.. త్వరలో ప్రారంభం

కాలజ్ఞానం రాస్తున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని తొలిసారి చూచినదెవరో తెలుసా?

తర్వాతి కథనం
Show comments