అలిపిరి నడకమార్గం మరో రెండు నెలలు మూసివేత.. శ్రీవారి మెట్టు ద్వారానే..?

Webdunia
బుధవారం, 14 జులై 2021 (11:31 IST)
తిరుమలకు నడిచే వెళ్లాలనుకునే వారికి ఓ వార్త. తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గం మరో రెండు నెలలు పాటు మూసివేయబోతున్నారు. సెప్టెంబరు మాసం లోపుగా మెట్ల మార్గంలో అభివృద్ధి పనులు పూర్తి చెయ్యాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఇఓ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 
 
ఫలితంగా, కాలినడకన శ్రీవారి దర్శనం చేసుకోవాలని భావించే భక్తులు సెప్టెంబరు వరకు శ్రీవారిమెట్టు నడక మార్గం ద్వారానే చేరుకునేందుకు భక్తులను అనుమతినిచ్చింది టీటీడీ. కాగా, మే నెలలో అలిపిరి నడక మార్గంలో మరమ్మత్తు పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం నడుంబిగించింది. దీంతో అప్పటి నుంచి అలిపిరి మెట్లదారిని రెండు నెలలపాటు మూసివేసి పనులు చేపట్టారు.
 
అయితే, నిర్దేశిత సమయంలో పనులు పూర్తి కాకపోవడంతో మరో రెండు నెలలపాటు మెట్ల మార్గాన్ని మూసివేయాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
 
అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల రాకపోకల్ని అనుమతించడం లేదని తెలిపింది. ప్రత్యామ్నాయంగా భక్తులు శ్రీవారి మెట్టు నడకమార్గాన్ని వినియోగించుకోవాలని టీటీడీ సూచించింది. కరోనా లాక్ డౌన్ల నేపథ్యంలో తిరుమలకు భక్తుల రాక తగ్గిన నేపథ్యంలో ఆ సమయంలో మరమ్మత్తుల కార్యక్రమం చేపట్టాలని టీటీడీ నిర్ణయించి, ఆదిశగా పనులు షురూ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన ప్రమాదం తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

లేటెస్ట్

దీపం జ్యోతిః పరబ్రహ్మః

Karthika Masam 2025 : కార్తీకమాసం సోమవారాలు, ఉసిరి దీపం తప్పనిసరి.. శివకేశవులను పూజిస్తే?

karthika maasam food: కార్తీక మాసంలో తినాల్సిన ఆహారం ఏమిటి, తినకూడనవి ఏమిటి?

టీటీడీకి రూ.900 కోట్లు-ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో పెరిగిన విరాళాలు

Karthika Masam: కార్తీక మాసం ప్రారంభం.. దీపారాధన, దీపదానం.. బిల్వార్చన చేస్తే?

తర్వాతి కథనం
Show comments