Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో 15 మంది తితిదే సిబ్బంది మృతి : వైవీ సుబ్బారెడ్డి

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (17:36 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. శ్రీవారి సేవకు అంకితమైన సిబ్బంది సైతం ఈ వైరస్ బారినపడి మృత్యువాతపడుతున్నారు. ఇప్పటివరకు కరోనా కారణంగా 15 మంది ఉద్యోగులు మృతి చెందారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 
 
తిరుమలలో విధులు నిర్వహిస్తున్నందువల్ల వీరు కరోనా బారిన పడలేదని... ఉద్యోగులు తిరుపతిలో నివసిస్తుంటారని, అక్కడే వీరు కరోనా బారిన పడ్డారని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగులకు వ్యాక్సిన్ వేయిస్తామని తెలిపారు. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో ఉద్యోగులకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తామని చెప్పారు. ఇకపోతే, ఈ వైరస్ బారిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామన్నారు.
 
తితిదే ఉద్యోగుల కోసం బర్డ్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. సేంద్రియ వ్యవసాయంతో పండించిన బియ్యంతో రేపటి నుంచి శ్రీవారికీ నైవేద్యం పెడుతామని తెలిపారు. భవిష్యతులో అన్నప్రసాదంలో కూడా సేంద్రియ వ్యవసాయంతో పండించిన పంటలతో భక్తులకు అన్నప్రసాదం పెట్టేందుకు ప్రయత్నిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికన్ సంస్థ జీఈతో భారత్ డీల్.. 1 బిలియన్ డాలర్ల ఒప్పందం సంతకానికి రెడీ

7,730 మట్టి గణేష విగ్రహాల తయారీ-వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎన్టీఆర్ జిల్లా

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

అన్నీ చూడండి

లేటెస్ట్

గణేశుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి?

24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...

24-08-2025 ఆదివారం మీ రోజువారీ ఫలితాలు

Padmanabhaswamy: శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో కంప్యూటర్ సిస్టమ్, సర్వర్ డేటాబేస్ హ్యాక్

Tapeswaram: తాపేశ్వరం లడ్డూల తయారీకి పూర్వ వైభవం.. గణేష్ పండల్ నుంచి ఆర్డర్లు

తర్వాతి కథనం
Show comments