కోట్ల డబ్బు కానుక వేస్తే దేవుడు ఎక్కువగా కరుణిస్తాడా?

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (21:24 IST)
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః - అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు.
 
ఎవరు నాకు భక్తితో ఆకును గానీ, పువ్వును గానీ, పండుని గానీ, జలమును గానీ భక్తి పూర్వకంగా సమర్పిస్తారో వాటినే నేను స్వీకరిస్తాను అని అర్థం. పైన తెలిపిన పత్ర పుష్పాదులు పేదలకు, ధనవంతులకు, పండితులకు, పామరులకు అందరికి అందుబాటులో ఉన్న వస్తువులే... శక్తి లేనివారు మేము పెద్దపెద్ద నైవేద్యాలను దేవునికి సమర్పించలేకపోయామే అని దిగులు పడనక్కర్లేదు.
 
ఎందుకంటే భగవంతుడు భక్తిని, హృదయ శుద్దిని మాత్రమే ప్రధానంగా ఎంచుతాడు. కానీ వస్తువుని కాదు. బ్రహ్మాండాలన్నీ ఆయన పొట్టలోనే కదా ఉన్నాయి. ఆయనకు ఏమి కొరత... ఎంతో భక్తిశ్రద్దలతో శబరి ఎంగిలి చేసిన పండ్లను శ్రీరామునికి నోటికి అందిస్తే ఆ పరందాముడు ఎంతో ప్రేమగా స్వీకరించాడు. అలాగే శ్రీకృష్ణుడు అడిగి మరీ కుచేలుని వద్ద అటుకులు పెట్టించుకుని మరీ ఆరగించాడు. 
 
అదేవిదంగా సాయినాధుడు వద్దకు ఎందరో ధనవంతులు ఖరీదైన పిండివంటలు తెచ్చి పెట్టినా కడు బీదరాలు తెచ్చిన జొన్నరొట్టెను తిన్నారు. ఎవరైనా సరే భక్తితో కూడి నిర్మలచిత్తుడై ఉన్నట్లయితే అతడు సమర్పించిన దానినే సర్వేశ్వరుడు స్వీకరిస్తాడు. ముక్తికి అర్హత, యోగ్యత ప్రధానం కానీ తక్కిన విషయాలు కావు అని భగవంతుడు ఉద్బోధిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విభూతి జలపాతంలో మునిగి పర్యాటకుడి మృతి

అమరావతిలో ప్రపంచ బ్యాంకు సాంకేతిక బృందం..

వెనక్కి తగ్గేదేలేదంటున్న ఇరాన్.. పౌరులు యుద్ధంలో పాల్గొనాలని పిలుపు

ఏపీ దేవాదాయ శాఖ ఏసీ కాళింగిరి శాంతి అరెస్టు

ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతం... డోనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

అన్నీ చూడండి

లేటెస్ట్

05-04-2026 నుంచి 11-04-2026 వరకు ఫలితాలు- మీ శ్రీమతిని కష్టపెట్టొద్దు...

04-04-2026 శనివారం ఫలితాలు.. అదృష్ట యోగమే కలిసివస్తుంది..

03-04-2026 శుక్రవారం ఫలితాలు... అనుకోని సమస్య ఎదురవుతుంది

రాత్రి వేళ తిరుమల గిరులు ఎంత అద్భుతంగా వున్నాయో..? (video)

హనుమజ్జయంతి.. కోటి సంవత్సరాల ముందు పుట్టారు.. 41 రోజుల దీక్ష

తర్వాతి కథనం
Show comments