Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటిమిట్టలో పున్నమి వెలుగులో సీతారామకళ్యాణం.. ఆంజనేయుడు మాత్రం?

Webdunia
ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (11:52 IST)
క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని విష్ణుమూర్తి తన అర్ధాంగిగా చేసుకోగా, పగలు జరిగే వీరి కల్యాణ మహోత్సవాన్ని తాను చూడలేకపోతున్నానని లక్ష్మీదేవికి సోదరుడిగా అదే పాల సముద్రంలో జన్మించిన చంద్రుడు విన్నవించుకున్నాడట. అందుకే ఒక్క ఒంటిమిట్టలో మాత్రం వెన్నెల వెలుగుల్లో కల్యాణం జరిగేలా నారాయణుడు చంద్రునికి వరమిచ్చాడట. అందుకే ఇక్కడ రాత్రిపూట మాత్రమే స్వామివారి కల్యాణం జరుగుతుంది. 
 
అలాగే ఈ ఆలయంలో రామభక్తుడైన శ్రీ ఆంజనేయుడు మాత్రం కనిపించడట. దేశంలో హనుమంతుడి విగ్రహం కనిపించని ఏకైక రామాలయం ఒంటిమిట్ట ఆలయమే. ఇందుకు కారణం ఏమిటంటే.. రాముడు, ఆంజనేయుడు కలవడానికి ముందే ఒంటిమిట్టలో సీతారామలక్ష్మణుల విగ్రహం ప్రతిష్ఠించారట.
 
రామ లక్ష్మణులను తన యాగ రక్షణకు తీసుకెళ్లిన విశ్వామిత్రుడు, ఆపై వారిని మిథిలకు తీసుకెళ్లి, శివధనుస్సును విరిచేలా చూసి, సీతారామ కల్యాణం జరిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే.. శ్రీరామ బ్రహ్మోత్సవాలకు ఒంటిమిట్ట కోదండ రామాలయం ముస్తాబైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం 18న జరుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. బస్సును నడుపుతూ కుప్పకూలిపోయాడు..

తెలంగాణలో అత్యధికంగా వరకట్న హత్యలు.. ఏడింటింలో మూడు హైదరాబాదులోనే

అనధికార తవ్వకం కారణంగా హిందూపూర్‌లో దెబ్బతిన్న సిటీ గ్యాస్ పైప్‌లైన్

CBN-Jagan: తిరుపతితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్‌కు బాంబు బెదిరింపులు

Chandra Babu Naidu: ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభం.. ధృవీకరించిన చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

01-10-2025 బుధవారం ఫలితాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

మహిషాసుర మర్దిని: చెడుపై మంచి సాధించిన విజయం

148 ఏళ్ల నాటి కన్యకా పరమేశ్వరి కోటి కుంకుమార్చన.. రూ.5కోట్ల బంగారం, కరెన్సీతో అలంకారం

Suryaprabha Seva: సూర్యప్రభ వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి.. వీక్షితే..?

01-10- 2025 నుంచి 31-10-2025 వరకు మీ మాస ఫలితాలు

తర్వాతి కథనం
Show comments