వారాహి అమ్మవారి దీక్ష: పూజానంతరం డిప్యూటీ సీఎం పవన్ చెప్పులు వేసుకోవచ్చా? లేదా?

ఐవీఆర్
బుధవారం, 26 జూన్ 2024 (15:46 IST)
వారాహి అమ్మవారి దీక్ష చేస్తూ...
కోరిన కోర్కెలు తీర్చే తల్లి, శత్రువులకు సింహ స్వప్నం, ఆటంకాలను పటాపంచలు చేసే దేవి వారాహి దీక్ష చేస్తున్నారు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఐతే ఆయన తన కార్యాలయానికి చెప్పులు వేసుకుని రావడంపై పెద్ద చర్చను లేవదీస్తున్నారు చాలామంది. ఇంతకీ డిప్యూటీ సీఎం అలా చెప్పులు వేసుకు రావడం తప్పా? అంటే కాదనే అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.
 
వారాహి అమ్మవారి దీక్షాస్థలి వద్ద మాత్రమే పాదరక్షలు ధరించరాదు. అక్కడ అమ్మవారికి త్రికరణశుద్ధితో పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి. ఎలాంటి ఇతర వ్యాపకాలకు తావుండకూడదు. పూజాది కార్యక్రమాలు ముగిసాక ప్రతి మనిషికి సాధారణ రోజువారీ కార్యక్రమాలు వుంటాయి. కనుక బయటకు వెళ్లేటప్పుడు, కార్యాలయంలో విధులు నిర్వహించేటపుడు పాదరక్షలు వేసుకోవచ్చు.
 
కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి...
ఐతే డిప్యూటీ సీఎం పాదరక్షలు వేసుకున్నారంటూ గత రెండు రోజులుగా దీనిపై పెద్ద దుమారమే జరుగుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్యాత్మికపరంగా పూజలు, యాగాలు చేయడం ఇవాళ కొత్తకాదు. ఎన్నో ఏళ్లుగా ఆయన పద్ధతి ప్రకారం యాగాలు, క్రతువులు ఆధ్యాత్మికపరమైన నియమానాలను అనుసరించి చేస్తున్నారు. కనుక చెప్పులు గురించి మాట్లాడేవారు ఇకనైనా మానుకోవాలని హితవు పలుకుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటిన 8నెలల గర్భవతి.. భారతీయ మహిళ మృతి

శబరిమలలో భారీ రద్దీ.. స్పృహ కోల్పోయి మృతి చెందిన మహిళా భక్తురాలు

నవంబర్ 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూపు-2 పరీక్ష రద్దు : తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

తర్వాతి కథనం
Show comments