వైకుంఠ ఏకాదశి: ఉప్పు, చింతపండు చేర్చకూడదట..!

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2020 (10:44 IST)
Tamarind, Salt
వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉత్తర ద్వార దర్శనం చేసే వారికి సకల సంపదలు చేకూరుతాయి. వైకుంఠ ప్రాప్తి సిద్ధిస్తుంది. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఆలయాల్లి సందర్శించడం ఉత్తమ ఫలితాలు దక్కుతాయి. ఏకాదశి రోజు రాత్రి జాగరణను మరిచిపోకూడదు. నారాయణ మంత్రంతో స్వామిని జపించాలి. ద్వాదశి రోజున వ్రతాన్ని ముగించే రోజున ఉదయం స్నానమాచరించి.. పెరుమాళ్ల వారికి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత ఆహారం తీసుకోవచ్చు. ద్వాదశి స్వామి వారికి సమర్పించే నైవేద్యంలో ఉప్పు, చింతపండు చేర్చ కూడదు. బియ్యంతో వండిన ఆహారం, గోధుమలు తీసుకోకూడదు.
 
వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు. 
 
అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. 
 
ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి బ్రేక్: పాక్ చర్చలు

యువతితో అక్రమ సంబంధం... ఇంట్లో తెలిసిందనీ భార్యను చంపేసిన డాక్టర్ భర్త

పశ్చిమ ఆసియా సంక్షోభం.. మార్చి 25న అఖిలపక్ష సమావేశం - భారత ప్రభుత్వం

36 -37 డిగ్రీల సెల్సియస్‌: హైదరాబాదులో పెరిగిన ఉష్ణోగ్రతలు

భారత నౌకాదళం భద్రత మధ్య ఇండియాకు బయలుదేరిన ఇంధన నౌకలు

అన్నీ చూడండి

లేటెస్ట్

21-03-2016 శనివారం ఫలితాలు- చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు

20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు

తర్వాతి కథనం
Show comments