జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం?

Webdunia
ఆదివారం, 31 మే 2020 (09:14 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో దశ లాక్డౌన్ మే 31వ తేదీ అర్థరాత్రితో ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ జూన్ 30వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ లాక్డౌన్‌లో అనేక సడలింపులు ఇచ్చింది. అలాగే, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను జూన్ ఎనిమిదో తేదీ నుంచి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో శ్రీవారి ఆలయం కూడా జూన్ 8 తర్వాత భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని భావిస్తోంది. 
 
ఇందుకోస తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా ముఖానికి మాస్కులు ధరించడం, సామాజిక భౌతికదూరం పాటించడంవంటి జాగ్రత్తలన్నీ పాటించేలా చర్యలు తీసుకోనుంది. 
 
ఇదే అంశంపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఆలయం ఎపుడు తెరవాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిసెంబర్ 21న పార్టీ నేతలతో సమావేశం కానున్న కేసీఆర్.. ఆ అంశాలపై చర్చ

నీతో మాట్లాడాలి అంటూ యువతిని తీసుకెళ్లి అత్యాచారం చేసిన యువకుడు, మృతి

ఇదేం పిచ్చిరా బాబూ.. హైవే వంతెనపై డేంజరస్ స్టంట్స్ (Video Viral)

Indian Army: ఆపరేషన్ సింధూర్‌ ఎఫెక్ట్: 850 కామికాజ్ డ్రోన్‌లను కొనుగోలు చేసిన భారత సైన్యం

వైకాపా రౌడీలకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

19-12-2025 శుక్రవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలంగా లేదు.. ఆచితూచి అడుగేయండి...

శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు.. మిథునరాశి వారికి.. ఆదాయం ఎంత?

17-12-2025 బుధవారం ఫలితాలు - రుణవిముక్తులవుతారు. తాకట్టు విడిపించుకుంటారు

2026-2027: శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు.. వృషభరాశి వారికి.. వ్యయం ఎంతంటే?

టీటీడీకి రూ.60 లక్షలు విరాళం

తర్వాతి కథనం
Show comments