జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం?

Webdunia
ఆదివారం, 31 మే 2020 (09:14 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో దశ లాక్డౌన్ మే 31వ తేదీ అర్థరాత్రితో ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ జూన్ 30వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ లాక్డౌన్‌లో అనేక సడలింపులు ఇచ్చింది. అలాగే, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను జూన్ ఎనిమిదో తేదీ నుంచి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో శ్రీవారి ఆలయం కూడా జూన్ 8 తర్వాత భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని భావిస్తోంది. 
 
ఇందుకోస తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా ముఖానికి మాస్కులు ధరించడం, సామాజిక భౌతికదూరం పాటించడంవంటి జాగ్రత్తలన్నీ పాటించేలా చర్యలు తీసుకోనుంది. 
 
ఇదే అంశంపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఆలయం ఎపుడు తెరవాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Summer holidays: తెలంగాణలో ఒంటి పూట బడులు.. షెడ్యూల్ ఇదే

వైఎస్సార్ కడప జిల్లాలో 15 అదనపు శనగ సేకరణ కేంద్రాల ఏర్పాట్లు

వైఎస్ జగన్‌ను కలిసిన హాస్య నటుడు బ్రహ్మానందం.. ఎక్కడ.. ఎందుకు?

సర్ ప్రక్రియలో సాయం కోసం జ్యూడిషియ అధికారుల నియామకం : సుప్రీంకోర్టు ఆదేశం

పెట్రోల్ బంక్‌‍లో సిగరెట్ కాల్చొద్దన్న సిబ్బంది.. ఆగ్రహంతో ఇంధన ట్యాంకుకు నిప్పు (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

15-02-2026 ఆదివారం ఫలితాలు - జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు

15-02-2026 నుంచి 21-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

Rahu Ketu Transit 2026: రాహు, కేతు గ్రహాల సంచారం.. ఈ రాశుల వారికి లాభం..

Srisailam: శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు.. భద్రత కట్టుదిట్టం

14-02-2026 శనివారం ఫలితాలు - పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు....

తర్వాతి కథనం
Show comments