Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం?

Webdunia
ఆదివారం, 31 మే 2020 (09:14 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో దశ లాక్డౌన్ మే 31వ తేదీ అర్థరాత్రితో ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ జూన్ 30వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ లాక్డౌన్‌లో అనేక సడలింపులు ఇచ్చింది. అలాగే, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను జూన్ ఎనిమిదో తేదీ నుంచి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో శ్రీవారి ఆలయం కూడా జూన్ 8 తర్వాత భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని భావిస్తోంది. 
 
ఇందుకోస తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా ముఖానికి మాస్కులు ధరించడం, సామాజిక భౌతికదూరం పాటించడంవంటి జాగ్రత్తలన్నీ పాటించేలా చర్యలు తీసుకోనుంది. 
 
ఇదే అంశంపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఆలయం ఎపుడు తెరవాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments