Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృషభ లగ్నంలో పుట్టిన జాతకులైతే..?

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (15:58 IST)
మేష లగ్నంలో పుట్టిన జాతకులు పగడం, కెంపు, కనకపుష్యరాగమును ధరించడం శుభప్రదమని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీనిని ధరించడం వలన ఆయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. 
 
ఇదే జాతకులు కెంపు రత్నాన్ని ధరించడం ద్వారా పుత్రప్రాప్తి, గౌరవం వంటి శుభఫలితాలున్నాయి. ఇక మేషలగ్నంలో పుట్టిన జాతకులు కనక పుష్యరాగాన్ని ధరించడం ద్వారా అదృష్టం వెన్నంటి వుంటుంది. అలాగే కుటుంబానికి లాభం చేకూరుతుంది. 
 
ఇక వృషభలగ్నంలో పుట్టిన జాతకులైతే.. వజ్రమును ధరించడం ద్వారా రుణభారము తొలగిపోతుంది. శత్రుబాధల్ని తగ్గించి ధనలాభము కలుగుతుంది. అలాగే ఈ జాతకులు నీలమును ధరించడం ద్వారా ధన భాగ్యము చేకూరుతుంది. శారీరక తేజస్సు పెరిగి ముఖవర్చస్సు పెరుగును. అదృష్టముతో పాటు ఉద్యోగము వచ్చును. ఉద్యోగములో ఉన్నత స్థానమును అలంకరిస్తారు. 
 
వృషభ లగ్నంలో జన్మించిన జాతకులు జాతిపచ్చను ధరించడం ద్వారా విద్యాభివృద్ధి కలిగి జ్ఞాపకశక్తి పెరుగును. ప్రతిభతో పరీక్షల్లో విజయం లభించును. సంతానం, ధనలాభము కలుగుతుందని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments