Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో వసంతోత్సవాలు.. కళ్యాణ మండపంలో నిరాడంబరంగా...

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (09:22 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలు ఈ దఫా కేవలం ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలోనే జరుగనున్నాయి. 
 
నిజానికి ప్రతియేటా చైత్రశుద్ధ త్రయోదశికి మొదలై పౌర్ణమికి ముగిసేలా మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఇందులోభాగంగా మూడు రోజుల పాటు మధ్యాహ్న సమయంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి ఆలయంలోని కళ్యాణ మండపంలో అభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు. 
 
తొలి రెండు రోజులు మలయప్పస్వామి, దేవేరులు మాత్రమే వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజున మూడు యుగాలను గుర్త్తుచేస్తూ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామికి ఏకకాలంలో అభిషేకం నిర్వహిస్తారు. దాంతో పవిత్సోత్సవాలు ముగుస్తాయి. 
 
అయితే, ఈ యేడాది కరోనా వైరస్ ప్రభావం కారణంగా వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు నిర్వహించే రథోత్సవాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. దానికి బదులుగా సర్వభూపాల వాహనంలో ఉత్సవర్లను కొలువుదీర్చి మండపంలోనే విశేష సమర్పణ నిర్వహించేలా నిర్ణయించారు. మొత్తంమీద శ్రీవారి సేవలు, ఉత్సవాలన్నీ భక్తులు లేకుండానే కేవలం ఆలయ అధికారులు, వేదపండితుల సమక్షంలోనే జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments