తితిదేలో గోపూజ వివాదం.. ఛైర్మన్ చెప్పారు.. ఈవో విస్మరించారు... కారణమేంటి?

తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రతి శుక్రవారం సాయంత్రం గోపూజ నిర్వహిస్తాం. ఈ శుక్రవారం నుంచే దీన్ని ప్రారంభిస్తున్నాం. మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి రండి. ఈనెల 13వ తేదీ తిరుపతి మాధవంలో తన కార్యాలయంలో

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (14:08 IST)
తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ప్రతి శుక్రవారం సాయంత్రం గోపూజ నిర్వహిస్తాం. ఈ శుక్రవారం నుంచే దీన్ని ప్రారంభిస్తున్నాం. మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి రండి. ఈనెల 13వ తేదీ తిరుపతి మాధవంలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి ప్రకటన చేశారు. ఆశ్చర్యం ఏమంటే దీనికి ముందురోజే తిరుమలలో ఈఓ సాంబశివరావు మీడియా సమావేశం నిర్వహించారు. 
 
సూచనప్రాయంగానైనా గోపూజ గురించి ఆయన చెప్పలేదు. ఛైర్మన్‌ మాత్రం ప్రత్యేకంగా గోపూజ గురించి చెప్పారు. ఏదో ఈఓ మరిచిపోయి ఉంటారులే అనుకున్నారు పాత్రికేయులు. శుక్రవారం వచ్చింది.. శ్రీవారి ఆలయం ముందు గోపూజ నిర్వహించలేదు. గోశాలలో నిర్వహించారు. అనంతరం పొద్దుపోయాక గోవులను ఆలయం ముందుకు తీసుకొచ్చి వాటికి ఆహారం అందించారు. 
 
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ చదలవాడ గానీ, ఈఓ సాంబశివరరావుగానీ, ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తదితరులు ఎవరూ కనిపించలేదు. గోశాల డైరెక్టర్‌ హరినాథరెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ కోదండరామారావు ఛైర్మన్‌ పిఎస్‌ తదితరులు మాత్రమే కనిపించారు.
 
తితిదే ఏ కార్యక్రమాన్ని కొత్తగా ప్రవేశపెట్టినా అత్యంత ఘనంగా ప్రారంభిస్తుంది. అలాంటిది గోపూజ మాత్రం చడీచప్పుడు కాకుండా ఎందుకు సాగిపోయింది? గోశాలలో గోపూజ చేయడం మామూలే. కొత్తేమీ లేదు. ఆలయం ఎదుట చేస్తామన్న గోపూజను గోశాలలోనే ఎందుకు కానిచ్చారు. అసలు ఇది తితిదే పాలకమండలి నిర్ణయించిన కార్యక్రమమేనా? శ్రీవారి ఆలయం ఎదుట గోపూజ నిర్వహించడానికి ఆగమ పండితులు ఆశక్తి చూపలేదు. ఛైర్మన్‌ చదలవాడ మాట్లాడేటప్పుడు ఆలయం వద్ద గోపూజ చేయకూడదని అంటున్నారు. గోవు అందరికీ చాలా పవిత్రమైనది. గోవుకు పూజ చేయడం తప్పేమీకాదు. గోపూజ చేస్తామని చెప్పారు. గోపూజలకు సంబంధించి తితిదేలో ఇంత గందరగోళం ఏమిటో అర్థం కాదు. తిరుపతి గోశాలలో గోపూజ నిర్వహిస్తున్నారు.
 
అలిపిరిలో గోపూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల గోశాలలోనూ పూజ జరుగుతోంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆలయం ఎదుట నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏమి వచ్చిందో తెలియదు. అంతా ఏకాభిప్రాయానికి వస్తే ఆలయం ఎదుట చేసినా మంచిదే కానీ ఇప్పుడు జరిగిన తీరు చేస్తుంటే అదేదో తితిదేకి సంబంధం లేనిదిగా కనిపిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.2 కోట్లు విరాళమిచ్చిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్

పాలకులం కాదు.. సేవకులకు మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి

దారంతా గతుకులు.. భవిష్యత్ ఏంటన్న ప్రశ్న ఉండేది.. తెలంగాణలో జనసేన గెలుపుపా పవన్ కళ్యాణ్

ఇంటర్, డిగ్రీ విద్యార్థులు కలిసి మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేశారు... తర్వాత...

మున్సిపాలిటీ వార్డు మెంబరుగా గెలిచిన మహిళా గొర్రెల కాపరి

అన్నీ చూడండి

లేటెస్ట్

12-02- 2026 గురువారం ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం

మహా శివరాత్రి.. భక్తుల ప్రయాణం సులభతరం.. టీజీఎస్సార్టీసీ ప్రత్యేక బస్సులు

11-02-2026 బుధవారం ఫలితాలు - వాక్యాతుర్యంతో నెట్టుకొస్తారు....

Maha shivaratri 2026 ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం?

10-02-2026 మంగళవారం ఫలితాలు - ఆలోచించి ముందుకు సాగండి.. ఒత్తిళ్లకు గురికావద్దు...

తర్వాతి కథనం
Show comments