తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా శ్రీవారి భక్తుడే!

ఏంటిది. ప్రపంచంలో హిందువుగా ఉన్న ఎవరైనా సరే తిరుమల శ్రీవారిని ప్రార్థించి తీరుతారు. అలాంటిది పక్క తెలుగు రాష్ట్రంలో ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీవారి భక్తుడే అంటారేంటి అనుకుంటున్నారా.. అక్కడే

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (14:04 IST)
ఏంటిది. ప్రపంచంలో హిందువుగా ఉన్న ఎవరైనా సరే తిరుమల శ్రీవారిని ప్రార్థించి తీరుతారు. అలాంటిది పక్క తెలుగు రాష్ట్రంలో ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీవారి భక్తుడే అంటారేంటి అనుకుంటున్నారా.. అక్కడే ఉంది.. అసలు మెలిక. రాష్ట్రం విడిపోక ముందైనా, విడిపోయిన తర్వాతైనా కేసీఆర్‌కు తిరుమల శ్రీవారు అంటే ఎంతో భక్తి. ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచే శ్రీనివాసుడికి అత్యంత పరమభక్తుడు. అయితే ప్రస్తుతం తితిదే ఆస్తులు తెలంగాణాకు వాటా రావాలని చిలుకూరు స్వామి వేసిన పిటిషన్‌ పెద్ద దుమారాన్నే రేపుతోంది. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయంలో తెలంగాణాకు వాటా రావాలని కొందరు అడగవచ్చుగానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు (కెసిఆర్‌) ఆ మాట అంటారని అనుకోలేం. ఎందుకంటే ఆయన కూడా శ్రీవారి భక్తుడే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్వామివారికి 5 కోట్ల రూపాయలకుపైగా విలువచేసే ఆభరణాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర కలలను సాకారం చేసుకుని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేసీఆర్ ఏడుకొండలవాడి మ్రొక్కు తీర్చుకోవాలని భావించారు.
 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీనివాసునికి తామర పూల నమూనాతో కూడా బంగారు సాలిగ్రామ హారాన్ని, 5 పేటల కంటెను సమర్పించాలనుకున్నారు. వీటి తయారీ కోసం 29.02.2016న ఆ రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్లను తితిదేకి జమ చేసింది. మొత్తం 19072 గ్రాముల బరువుండే ఈ ఆభరణాలను తితిదే తయారు చేయిస్తోంది. దీనికి సంబంధించి టెండర్లు పిలిచింది. టెండరు ప్రకటనను పత్రికల్లో ప్రచురించడం సహా మొత్తం 5 కోట్ల 2 లక్షల 79 వేల 170 రూపాయలు ఖర్చవుతుంది. ఆభరణాల తయారీ పూర్తయిన తరువాత కేసీఆర్ స్వయంగా తిరుమలకు వచ్చి స్వామివారికి సమర్పించుకున్నారు. ఇలా మ్రొక్కు తీర్చుకుంటున్న కేసీఆర్‌ తితిదే ఆదాయం నుంచి వాటా ఆశిస్తారని అనుకోలేం. మరి ఈ విషయంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ ఎలా స్పందింస్తారనేది ఆశక్తిగా మారింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మూడు నెలల్లోగా కొత్త రాజకీయ పార్టీ..ఫోన్ ట్యాపింగ్ కేసు సీరియల్‌గా కొనసాగుతోంది.. కవిత

రాజమండ్రిలో పెద్దపులిని అలా పట్టేసిన అటవీ శాఖాధికారులు

బాత్రూమ్‌లు శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనాలతో చేసిన నెయ్యితో లడ్డూ చేశారు..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు.. 336 స్థానాల్లో జనసేన పోటీ

ఏరోస్పేస్, విమానయాన తయారీ యూనిట్లకు కేంద్రంగా సత్యసాయి జిల్లా

అన్నీ చూడండి

లేటెస్ట్

03-02-2026 మంగళవారం రాశి ఫలితాలు- రుణ సమస్య పరిష్కారమవుతుంది

Ramzan: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జోరందుకున్న రంజాన్ షాపింగ్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

తర్వాతి కథనం
Show comments