శ్రీరాముడే చంపుతుంటే ఇక ఎవరికి మొరపెట్టుకునేది రామా...

దేహానికి సుఖదుఃఖాలనేవి ఉండనే ఉన్నాయి. భగవత్సాక్షాత్కారం పొందినవాడు తన మనస్సు, ప్రాణం, దేహం, ఆత్మ సమస్తాన్ని భగవంతునికి సమర్పిస్తాడు. పంపా సరోవరంలో స్నానం చేయడానికి వెళ్లినప్పుడు రామలక్ష్మణులు తమ ధనుస్సులను నేలలోకి గుచ్చారు. స్నానం చేశాక లక్ష్మణుడు ధన

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (18:42 IST)
దేహానికి సుఖదుఃఖాలనేవి ఉండనే ఉన్నాయి. భగవత్సాక్షాత్కారం పొందినవాడు తన మనస్సు, ప్రాణం, దేహం, ఆత్మ సమస్తాన్ని భగవంతునికి సమర్పిస్తాడు. పంపా సరోవరంలో స్నానం చేయడానికి వెళ్లినప్పుడు రామలక్ష్మణులు తమ ధనుస్సులను నేలలోకి గుచ్చారు. స్నానం చేశాక లక్ష్మణుడు ధనుస్సును తీసి చూసేసరికి దాని కొన రక్తసిక్తమై ఉండటం గమనించాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో తమ్ముడూ... చూడు, చూడు ఏదో ప్రాణి హింసకు గురి అయినట్లుంది అన్నాడు.
 
లక్ష్మణుడు మట్టి తవ్వి చూసేసరికి పెద్ద కప్ప ఒకటి కనిపించింది. అది మరణించే స్థితిలో ఉంది. రాముడు కరుణ పూరిత స్వరంతో నువ్వెందుకు అరవలేదు. మేము నిన్ను కాపాడటానికి ప్రయత్నించి ఉండేవాళ్లం కదా... పాము వాతన పడినప్పుడు నువ్వు బెకబెక మంటావు కదా.. అన్నాడు. అందుకు ఆ కప్ప ఇలా అంది....
 
ఓ రామా..... పాము పట్టుకున్నప్పుడు ఓ రామా... రక్షించు, ఓ రామ రక్షించు... అని కేకలు పెడతాను. అయితే ఇప్పుడు చూడబోతే రాముడే నన్ను చంపుతున్నాడు. అందుకే నేను మౌనం వహించాను అని అంది.
 
- శ్రీరామకృష్ణ పరమహంస

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విజయవాడ నడిబొడ్డున మావోయిస్టులు - 31 మంది నక్సలైట్లు అరెస్టు

Bengaluru Scam: రూ.32కోట్ల స్కామ్.. ఆమెకు అంత సంపాదన ఎలా వచ్చింది? నెటిజన్ల ప్రశ్న

తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వర్షాలు.. తీవ్రమైన చలి

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

అన్నీ చూడండి

లేటెస్ట్

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య

14-11-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య కొలిక్కివస్తుంది

తర్వాతి కథనం
Show comments