Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ మహాదేవర్ అతిశయ వినాయకుడు... ఆరు నెలలకోసారి రంగు మార్చుకుంటున్నాడు...

వినాయకుడి విగ్రహం రంగు ఆరునెలకోసారి మారుతూఉంటుందట. ఉత్తరాయణ కాలం వరకు వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం నుండి తెల్లని రంగులోని మారుతారు. ఈ విధంగా విగ్రహం రంగులు మారడం వినాయకుని మహిమేనని భ

Webdunia
గురువారం, 5 జులై 2018 (10:50 IST)
వినాయకుడి విగ్రహం రంగు ఆరునెలకోసారి మారుతూఉంటుందట. ఉత్తరాయణ కాలం వరకు వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం నుండి తెల్లని రంగులోని మారుతారు. ఈ విధంగా విగ్రహం రంగులు మారడం వినాయకుని మహిమేనని భక్తులు అంటున్నారు. ఈ వినాయక ఆలయం తమిళనాడులోని నాగర్‌కోయిల్ జిల్లా కేరళపురం గ్రామంలో ఉంది.
 
ఈ ఆలయాన్ని మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయమని అంటారు. ఈ ఆలయంలో ఆవరణలో ఓ మంచినీటి బావి ఉంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ఆలయంలో మాత్రం వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో ఆ బావి నీరు తెల్లగా మారుతాయి, మళ్లీ వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో ఆ నీరు నల్లగా మారుతాయి.
 
సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళా ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. కానీ ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారు.
 
ఈ ఆలయం 1317 సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదని చరిత్రకారుల అంచనా. నిజానికిది శివాలయమట. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉండేది. ఆ తరువాతనే ఈ వినాయకుని ఆలయాన్ని నిర్మించారు. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవల్ అతిశయ వినాయగర్ ఆలయమని అంటారు. 
 
ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తరువాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments