సీతాదేవితో హనుమంతుడు సంభాషించేటపుడు...

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (22:25 IST)
దైవ మార్గములో పయనించదలిచేవారు దేహాభిమానాన్ని, పేరు ప్రతిష్ఠలను దూరంగా ఉంచాలి. తనను లోక సేవకునిగాను, భగవంతుని దాసానుదాసుని గాను భావించాలి. మానవుడు నిరాడంబరుడై తనను భగవంతుని యొక్క ఒకానొక  సేవకునిగా తలంచుచు వినయ విధేయతలు కలిగి వర్తించాలి. చేతనైనంతవరకు లోకోపకారం చేస్తుండాలి. 
 
గౌరవ మర్యాదలను కాంక్షించరాదు. తాను గొప్పవాడైనా తన గొప్పను గూర్చి ఇతరులకు చెప్పుకొనగారాదు. అశోకవనమందు సీతాదేవితో సంభాషించేటప్పుడు హనుమంతుడు తాను శ్రీరామచంద్రుని వద్దగల వానరులలో చివరి వాడను అని చెప్పుకొన్నాడు. 
 
ఎంత బలము, సామర్థ్యము, శక్తి కల్గియున్ననూ హనుమంతుడు ఎంతటి వినయవిధేయతలు కలిగియున్నాడో లోకానికి తెలిసియేయున్నది కదా. కాబట్టి తరింపగోరేవారు నిరభిమానులై, భక్తి ప్రపత్తులు గలవారై ప్రతిష్ఠల కోసమై ప్రాకులాడక ప్రశాంత జీవితాన్ని గడపాలి. అట్టి  నిరభిమానుల వల్లనే లోకోద్ధరణ సంభవిస్తుంది. వారివల్లనే లోకం సుభిక్షంగా వుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దావోస్‌లో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం- బ్లైజ్

అటు ఫోన్ ట్యాపింగ్‌ - ఇటు లిక్కర్ స్కామ్.. జోరుగా విచారణలు

తెలంగాణలోని కొల్లాపూర్‌లో గ్రంథాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచిన డియాజియో ఇండియా

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

18-01-2026 నుంచి 24-01-2026 వరకు వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments