Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుఖభోగాలను అనుభవించాలని కోర్కెలున్నంత కాలం...

సంసారంలో సుఖభోగాలను అనుభవించాలని కోర్కెలున్నంత కాలం కర్మ త్యాగం చేయలేము. సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నంత వరకు కర్మ ఉండనే ఉంటుంది. కర్మలను పోగొట్టుకున్న తర్వాత వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉంటాడో ఈ పక్షి కథ ద్వారా తెలుసుకుందాం. ఒక పక్షి గంగానదిలో లంగరు ది

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (21:24 IST)
సంసారంలో సుఖభోగాలను అనుభవించాలని కోర్కెలున్నంత కాలం కర్మ త్యాగం చేయలేము. సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నంత వరకు కర్మ ఉండనే ఉంటుంది. కర్మలను పోగొట్టుకున్న తర్వాత వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉంటాడో ఈ పక్షి కథ ద్వారా తెలుసుకుందాం. ఒక పక్షి గంగానదిలో లంగరు దించివున్న ఓడ స్తంభంపై పరధ్యానంగా వ్రాలింది. ఓడ గంగానది నుండి క్రమక్రమంగా సముద్రంలోపలికి ప్రవేశించింది. అప్పుడు పక్షికి ఎరుక వచ్చి చూసేసరికి నలువైపులా ఎక్కడా తీరం కనిపించలేదు. తీరం చేరుకోవాలని అది ఉత్తరం వైపుగా ఎగిరిపోయింది. 
 
కాని అలా ఎంతదూరం పోయినా దానికి తీరం కనిపించలేదు. అందువల్ల అది తిరిగి వచ్చి ఓడ స్తంభం పైనే కూర్చుంది. కాసేపటి తర్వాత అది తూర్పు దిశగా ఎగిరిపోయింది. ఆ దిశలో కూడా దానికి తీరం కానరాలేదు. ఆ పక్షి నలువైపులా చూసింది. కేవలం అనంత జలరాశి మాత్రమే కనిపించింది. అప్పుడది ఎంతగానో అలసిపోయి తిరిగి వచ్చి ఓడ స్తంభం పైనే వ్రాలింది. ఈ విధంగా చాలాసేపు విశ్రాంతి తీసుకున్న పిదప అది మళ్లీ దక్షిణ దిశగా వెళ్లింది. అదేవిధంగా పడమటి వైపుగా కూడా వెళ్లింది.
 
తీరం ఎక్కడా కానరావటం లేదని గ్రహించిన తర్వాత అది తిరిగి వచ్చి ఆ ఓడ స్తంభం పైనే వ్రాలింది. మళ్లీ తిరిగి లేవలేదు. ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా అలాగే ఉండిపోయింది. ఆ తరువాత దాని మనస్సులో ఎటువంటి అలజడి, అశాంతి చోటుచేసుకోలేదు. సంసారులు సుఖభోగాల నిమిత్తం నలువైపులా తిరుగుతుంటారు. అయితే వారికి అవి ఎక్కడా లభించవు. అలా తిరుగుతూ చివరకు వారు అలసిపోతారు.
 
కామినీ కాంచనాల పట్ల వారికి ఉన్న ఆశక్తి ద్వారా కేవలం దుఃఖాన్ని మాత్రమే పొందినప్పుడు వారికి వైరాగ్యం కలుగుతుంది. త్యాగభావన జనిస్తుంది. చాలామందికి సుఖభోగాలు అనుభవింపనిదే త్యాగబుద్ధి కలుగదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

అన్నీ చూడండి

లేటెస్ట్

శరవణభవ నామ జపం చేస్తే చాలు, అంతరార్థం తెలుసా?

తన మనవడికి భగవద్గీత నేర్పిస్తున్న రజాకార్ నిర్మాత

Bonalu: జూన్ 26 నుండి గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం

28-05-2025 బుధవారం దినఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు...

Goddess Lakshmi: శ్రీ లక్ష్మీదేవికి ప్రీతికరమైన రాశులు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments