అందుకే నేను విభూతి ఇస్తాను: షిర్డి సాయిబాబా

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (21:15 IST)
శిరిడీలో భక్తులు నివశిస్తున్నప్పుడు సాయిబాబా ఎవరికీ ఊదీ ఇచ్చేవారు కాదు. ఐతే విభూతి ఇస్తున్నప్పుడు మాత్రం ఈ విశ్వమంతా భస్మంలా అశాశ్వతమని గ్రహించండి అని సూచించేవారు. ఆ కట్టెల మాదిరిగానే ఈ శరీరం కూడా. ఈ దేహం పంచభూత నిర్మితం అయిున్నంత వరకూ ఇది వుంటుంది. 
 
ఆయువు తీరగానే ఇది శవమైపోతుంది. కాలి బూడిదవుతుంది. నేనూ, మీరూ అందరం కూడా ఈ స్థితికి చేరుకుంటాం. మీరంతా దీనిని జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టే నేను విభూతి ఇస్తాను. బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య. ఈ అర్థాన్నే విభూతి బోధిస్తూ వుంటుంది. అహర్నిశలు దీనిని స్మరిస్తూ వుండాలి. 
 
ఈ లోకంలో ఎవరికీ ఏమీ కారు. నగ్నంగా వచ్చావు నగ్నంగానే వెళతావు. ఈ సత్యాన్నే ఊదీ తెలియజేస్తుంది. ఈ ఊదీ వివేక పూర్ణ వైరాగ్యాన్ని కలిగి వుండమని సూచిస్తుంది. వీలయినంత ఎక్కువగా దక్షిణ ఇవ్వడం వల్ల మనిషిలో వైరాగ్య లక్షణం వృద్ధి చెందుతుంది. తర్వాత, తర్వాత క్రమంగా అతనికి వైరాగ్యం వంటబడుతుంది. ఒకరికి వైరాగ్యం ఏర్పడినా, అది వివేకయుక్తం కాకపోతే, ఆ వైరాగ్యం వ్యర్థ అవుతుంది. కాబట్టి విభూతిని ఆదరించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు కర్నూలులో రూ. 13, 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నా: ప్రధాని మోడి

ఆస్తుల పంపకంలో జగన్‌కు షాకిచ్చిన అప్పీలేట్ ట్రైబ్యునల్

ISRO: 2040 నాటికి స్వదేశీ సిబ్బందితో చంద్రయాత్రకు రంగం సిద్ధం

చైనాను కట్టడి చేయాలంటే భారత్ సాయం కావాల్సిందే : అమెరికా

Raymond: రేమండ్ గ్రూప్ నుంచి పెట్టుబడులు.. 5,500 ప్రత్యక్ష ఉద్యోగాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

12-10-2025 శనివారం ఫలితాలు- తొందరపాటు నిర్ణయాలు తగవు

దీపావళి రోజున దీపం మంత్రం, మహాలక్ష్మి మంత్రం

12-10-2025 నుంచి 18-10-2025 వరకు ఫలితాలు-జాతక పొంతన...

Mysore Pak Recipe: దీపావళి వంటకాలు.. మైసూర్ పాక్ చేసేద్దాం

సమ్మక్క సారలమ్మ మహా జాతర.. హుండీలో డబ్బులు వేయాలంటే క్యూ ఆర్ కోడ్

తర్వాతి కథనం
Show comments