అందుకే నేను విభూతి ఇస్తాను: షిర్డి సాయిబాబా

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (21:15 IST)
శిరిడీలో భక్తులు నివశిస్తున్నప్పుడు సాయిబాబా ఎవరికీ ఊదీ ఇచ్చేవారు కాదు. ఐతే విభూతి ఇస్తున్నప్పుడు మాత్రం ఈ విశ్వమంతా భస్మంలా అశాశ్వతమని గ్రహించండి అని సూచించేవారు. ఆ కట్టెల మాదిరిగానే ఈ శరీరం కూడా. ఈ దేహం పంచభూత నిర్మితం అయిున్నంత వరకూ ఇది వుంటుంది. 
 
ఆయువు తీరగానే ఇది శవమైపోతుంది. కాలి బూడిదవుతుంది. నేనూ, మీరూ అందరం కూడా ఈ స్థితికి చేరుకుంటాం. మీరంతా దీనిని జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టే నేను విభూతి ఇస్తాను. బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య. ఈ అర్థాన్నే విభూతి బోధిస్తూ వుంటుంది. అహర్నిశలు దీనిని స్మరిస్తూ వుండాలి. 
 
ఈ లోకంలో ఎవరికీ ఏమీ కారు. నగ్నంగా వచ్చావు నగ్నంగానే వెళతావు. ఈ సత్యాన్నే ఊదీ తెలియజేస్తుంది. ఈ ఊదీ వివేక పూర్ణ వైరాగ్యాన్ని కలిగి వుండమని సూచిస్తుంది. వీలయినంత ఎక్కువగా దక్షిణ ఇవ్వడం వల్ల మనిషిలో వైరాగ్య లక్షణం వృద్ధి చెందుతుంది. తర్వాత, తర్వాత క్రమంగా అతనికి వైరాగ్యం వంటబడుతుంది. ఒకరికి వైరాగ్యం ఏర్పడినా, అది వివేకయుక్తం కాకపోతే, ఆ వైరాగ్యం వ్యర్థ అవుతుంది. కాబట్టి విభూతిని ఆదరించాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారు స్మగ్లింగ్ కేసు... కన్నడ నటి రన్యా రావు విడుదలవుతారా?

థాంక్యూ సో మచ్ అమ్మా- తారక్‌కు చంద్రబాబు రిప్లై..

కబడ్డీ టోర్నీలో పందెం కాసి చిక్కుల్లోపడిన కర్నాటక మంత్రి.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం

ఇరాన్ నుంచి భారతీయులు తక్షణమే వీడండి: భారత ప్రభుత్వం హెచ్చరిక

హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై దాడి చేసిన ఇరాన్

అన్నీ చూడండి

లేటెస్ట్

20-04-2026 సోమవారం ఫలితాలు : నిర్విరామంగా శ్రమిస్తారు.. ఖర్చులు విపరీతం...

19-04-2026 ఆదివారం ఫలితాలు : ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు...

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున అద్భుత కలయిక.. ఉప్పు, గవ్వలతో ఇలా చేస్తే?

Simhadri Appanna: అక్షయ తృతీయ నాడే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవం

Parashurama Jayanti 2026: ప్రదోష కాలంలో జన్మించిన పరశురాముడు.. పూజ ఇలా చేస్తే?

తర్వాతి కథనం
Show comments