Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ యమునా నేను కనుక ఏమి తినని పక్షంలో... వ్యాసుడు అలా ఎందుకన్నాడంటే?

ఒకసారి వ్యాసమహర్షి యమునా నదిని దాటడానికి నది ఒడ్డుకు వచ్చాడు. అదే సమయంలో గోపికలు కూడా అక్కడకు వచ్చారు. ఆవలి ఒడ్డుకు చేరి విక్రయించే ఉద్దేశంతోవారు తమతో పాటు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి పట్టుకుపోతున్నారు. కానీ అక్కడ ఒక్క పడవ కూడా లేదు. ఎలా వెళ్లడమా అని

Webdunia
శనివారం, 2 జూన్ 2018 (22:11 IST)
ఒకసారి వ్యాసమహర్షి యమునా నదిని దాటడానికి నది ఒడ్డుకు వచ్చాడు. అదే సమయంలో గోపికలు కూడా అక్కడకు వచ్చారు. ఆవలి ఒడ్డుకు చేరి విక్రయించే ఉద్దేశంతోవారు తమతో పాటు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి పట్టుకుపోతున్నారు. కానీ అక్కడ ఒక్క పడవ కూడా లేదు. ఎలా వెళ్లడమా అని అందరూ దిగులుగా ఉన్నారు. అప్పుడు వ్యాస మహర్షి వారితో నాకు చాలా ఆకలి వేస్తుంది అన్నారు. అప్పుడు గోపికలు వారివద్దనున్న పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఆయనకు ఇచ్చారు. వాటినన్నిటిని ఆయన దాదాపు పూర్తిగా తినివేశాడు. 
 
పిదప ఆయన యమునా నదిని ఉద్దేశిస్తూ... ఓ యమునా నేను కనుక ఏమి తినని పక్షంలో, ఈ నీటిని రెండు పాయలుగా చేసి మధ్యలో మాకు దారి ఇవ్వు... మేమందరం ఆ దారిగుండా ఆవలి ఒడ్డుకు చేరుకుంటాం అన్నాడు. వెంటనే నది రెండు పాయలుగా విడిపోయి దారి ఏర్పడింది. వ్యాసుడు, గోపికలు తదితరులు ఆ దారిగుండా ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు. 
 
వ్యాసుడు నేనేమి తినలేదు అనడంలో అర్థం. నేను శుద్దాత్మ స్వరూపాన్ని... అని అర్థం. శుద్దాత్మ నిర్లిప్తమైనది. ప్రకృతికి అతీతమైనది. దానికి ఆకలిదప్పులు, చావుపుట్టుకలు అనేవి ఉండవు. అది అజరం(అంటే వయస్సు పైబడటం లాంటిది ఏదీ లేనిది), అమరం, మేరుపర్వతం లాంటిది(అంటే నిశ్చలమైంది). ఇలాంటి బ్రహ్మజ్ఞానం కలిగినవాడే జీవన్ముక్తుడు. ఆత్మ, దేహం వేరువేరు అని అతడు యదార్థంగా అర్థం చేసుకోగలుగుతాడు. భగవంతుని దర్శించినట్లయితే దేహాత్మభావన మరి ఉండబోదు. 
 
దేహం, ఆత్మలు రెండూ వేరైనవి. కొబ్బరికాయలో నీళ్ళు ఎండిపోయి ఎండుకొబ్బరి తయారైన పిదప కొబ్బరికాయ, కొబ్బరి వేరు వేరు అయిపోతాయి. అప్పుడు కాయను కదిలిస్తే లోపల ఉన్న కొబ్బరి కూడా కదులుతూ ఉంటుంది. అదేవిధంగా ఆత్మ కూడా దేహంలో కదులుతూ ఉంటుంది. విషయాసక్తి అనే నీరు ఎండిపోయినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మ వేరు, దేహం వేరు అన్న బోధ కలుగుతుంది. 
 
లేత పోకకాయ నుండి వక్కను కానీ, లేత బాదంకాయ నుండి బాదంపప్పును కానీ వేరు చేయలేము. కానీ కాయ పండినప్పుడు వక్క, బాదం పప్పు టెంక నుండి విడివడతాయి. కానీ కాయ పండినప్పుడు లోపలి రసం ఎండిపోతుంది. బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు విషయరసం ఎండిపోతుంది. అటువంటి జ్ఞానం జనించడం ఎంతో కష్టం. ఊరకే నోటితో పలికినంత మాత్రాన బ్రహ్మజ్ఞానం కలుగదు. మహాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?

వ్యభిచార గుట్టు రట్టు.. ఇద్దరు మహిళలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ - అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే- కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

అన్నీ చూడండి

లేటెస్ట్

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

06-04-2025 నుంచి 12-04-2025 వరకు మీ వార ఫలితాలు

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు- పరిస్థితులకు తగినట్లుగా నడుచుకోండి..

05-04-2025 శనివారం మీ రాశిఫలాలు : అటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు...

తర్వాతి కథనం
Show comments