తన కలిమియే ఇంద్ర భోగము లేమియే సర్వలోక దారిద్రంబు

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (22:15 IST)
ఒక ఊరిలో రాజావారుండేవారు. ప్రతిరోజూ క్షురకుడు వచ్చి రాజావారికి గెడ్డం గీసి వెళ్లడం ఆనవాయితీ. గెడ్డం గీస్తున్నంతసేపూ క్షురకుడు రాజావారితో ఆ ఊళ్లో కబుర్లు చెప్పడమూ, ఆయన సరదాగా వినడమూ ఇలాగ జరిగిపోతుండేది. ప్రతిరోజూ డబ్బు గురించి మంచి సంగతులు మాత్రమే చెబుతుండేవాడు క్షురకుడు.

 
ఎల్లప్పుడూ మంచి సంగతులే చెపుతున్నావేమిటి? అని రాజావారు అతణ్ణి అడిగారు ఒకరోజున. మరి మంచి సంగతులంటే మంచినే కదా, నేను చెపుతాను" అంటూ వుండేవాడు. ఇలా వుండగా ఒకరోజు గెడ్డం చేస్తూ క్షురకుడు తన కత్తుల పొదిన అక్కడే వుంచి బయటకు వెళ్లాడు. అప్పుడు రాజావారు ఏమి చేసారంటే ఆ పొది అరను లాగారు. అందులో కోడిగుడ్డంత బంగారం వుండ కనిపించింది.

 
ఇదా సంగతి... అని ఆ రాజావారు బంగారం గుడ్డును తీసి మళ్లీ ఎప్పటిలానే అక్కడే పెట్టి సర్దివేసారు. మర్నాడు ఉదయమే మామూలుగా క్షవరం చేయడానికి రాజావారి దగ్గరికి క్షురకుడు వచ్చాడు. ఈసారి... "మన ఊళ్లో దొంగలు పడ్డారు. పరిస్థితులు ఏమీ బాగాలేవు." అంటూ విచారం వెళ్లగక్కాడు.

 
అప్పుడు రాజావారు తాను తీసిపెట్టిన బంగారు గుడ్డును తిరిగి ఇచ్చి వేస్తూ మనిషి తాను బాగుంటే ప్రపంచమంతా బాగు. లేకపోతే ప్రపంచమంతా చెడ్డ అనేది మానవ సహజం అని అర్థం స్పురించో.. తన కలిమియే ఇంద్ర భోగము లేమియే సర్వలోక దారిద్రంబున్ అన్న సుమతి నీతిని అతడికి బోధించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త... పుర్రెను చీల్చుకుని నోట్లో నుంచి...

భారతీయ విద్యార్థులకు శుభవార్తం - హెచ్-1బీ వీసా ఫీజు చెల్లించక్కర్లేదు...

రౌడీ షీటర్ వేధింపులతో వివాహిత ఆత్మహత్య

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: తెలంగాణ భక్తుల వద్ద రూ.4లక్షల మోసం-దళారులను నమ్మొద్దు.. టీటీడీ వార్నింగ్

18-10-2025 శనివారం దినఫలాలు - ఆస్తి వివాదాలు జటిలమవుతాయి....

19న జనవరి కోటా శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు రిలీజ్

సంపదలను తెచ్చే ధన త్రయోదశి, విశిష్టత ఏమిటి?

17-10-2025 శుక్రవారం దినఫలాలు - ఖర్చులు విపరీతం.. ఆప్తులతో సంభాషిస్తారు...

తర్వాతి కథనం
Show comments