తన కలిమియే ఇంద్ర భోగము లేమియే సర్వలోక దారిద్రంబు

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (22:15 IST)
ఒక ఊరిలో రాజావారుండేవారు. ప్రతిరోజూ క్షురకుడు వచ్చి రాజావారికి గెడ్డం గీసి వెళ్లడం ఆనవాయితీ. గెడ్డం గీస్తున్నంతసేపూ క్షురకుడు రాజావారితో ఆ ఊళ్లో కబుర్లు చెప్పడమూ, ఆయన సరదాగా వినడమూ ఇలాగ జరిగిపోతుండేది. ప్రతిరోజూ డబ్బు గురించి మంచి సంగతులు మాత్రమే చెబుతుండేవాడు క్షురకుడు.

 
ఎల్లప్పుడూ మంచి సంగతులే చెపుతున్నావేమిటి? అని రాజావారు అతణ్ణి అడిగారు ఒకరోజున. మరి మంచి సంగతులంటే మంచినే కదా, నేను చెపుతాను" అంటూ వుండేవాడు. ఇలా వుండగా ఒకరోజు గెడ్డం చేస్తూ క్షురకుడు తన కత్తుల పొదిన అక్కడే వుంచి బయటకు వెళ్లాడు. అప్పుడు రాజావారు ఏమి చేసారంటే ఆ పొది అరను లాగారు. అందులో కోడిగుడ్డంత బంగారం వుండ కనిపించింది.

 
ఇదా సంగతి... అని ఆ రాజావారు బంగారం గుడ్డును తీసి మళ్లీ ఎప్పటిలానే అక్కడే పెట్టి సర్దివేసారు. మర్నాడు ఉదయమే మామూలుగా క్షవరం చేయడానికి రాజావారి దగ్గరికి క్షురకుడు వచ్చాడు. ఈసారి... "మన ఊళ్లో దొంగలు పడ్డారు. పరిస్థితులు ఏమీ బాగాలేవు." అంటూ విచారం వెళ్లగక్కాడు.

 
అప్పుడు రాజావారు తాను తీసిపెట్టిన బంగారు గుడ్డును తిరిగి ఇచ్చి వేస్తూ మనిషి తాను బాగుంటే ప్రపంచమంతా బాగు. లేకపోతే ప్రపంచమంతా చెడ్డ అనేది మానవ సహజం అని అర్థం స్పురించో.. తన కలిమియే ఇంద్ర భోగము లేమియే సర్వలోక దారిద్రంబున్ అన్న సుమతి నీతిని అతడికి బోధించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిర్మలమ్మ పద్దు 140 కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింభం : ప్రధాని మోడీ

నిర్మలమ్మ ఆర్థిక పద్దు... ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు

కేంద్ర బడ్జెట్ 2026-27 : ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలు

కేంద్ర బడ్జెట్ 2026-27 : దేశంలో 7 హై స్పీడ్ రైలు కారిడార్లు అభివృద్ధి

రికార్డు స్థాయిలో లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విత్తమంత్రి నిర్మలమ్మ

అన్నీ చూడండి

లేటెస్ట్

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలు, మిరపకాయలు కడితే దిష్టి పోతుందా?

తర్వాతి కథనం
Show comments